మెట్ట ప్రాంతాన్ని గోదారమ్మ ముద్దాడింది. ఎన్నో ఏండ్లుగా చుక్క నీటికోసం పరితపించిన హుస్నాబాద్ మెట్ట ప్రజల్లో భరోసా నింపుతూ ఆదివారం గోదారమ్మ పరుగులు తీసింది. పొలాల్లో సిరులు పండించేందుకు గౌరవెల్లి రిజర్వాయర్లో గోదారమ్మ జలతాండవం చేసింది. మెట్టప్రాంత వరప్రదాయిని గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్న్ విజయవంత మైంది.హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ సహా ఇంజినీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ట్రయల్న్ నిర్వహించారు. అక్కన్నపేట మండలం రేగొండ గ్రామ శివారులోని పంపుహౌస్, సర్జిఫూల్ ట్యాంకుల నుంచి గోదారమ్మ ఉవ్వెత్తున ఎగిసిపడి రిజర్వాయర్లో దూకింది. మోటర్లు విజయవంతంగా రన్ అయి సర్జిఫూల్ ట్యాంకుల్లోని నీటిని రిజర్వాయర్లోకి ఎత్తిపోశాయి. ఇంజినీరింగ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కేరింతలతో చప్పట్లు కొడుతూ జైతెలంగాణ, జేకేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. సంబురాలు చేసుకున్నారు.
హుస్నాబాద్, జూలై 31 : గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్న్ విజయవంతం కావడంతో మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. చూడలేమనుకున్న గోదారమ్మ నీటిని చూసి ఈ ప్రాంత జనం పులకరించింది. సాధ్యం కాదనుకున్న రిజర్వాయర్ను సుసాధ్యం చేసి, పనులు పూర్తి చేయించిన సీఎం కేసీఆర్కు, ఇందుకు కృషి చేసిన మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే సతీశ్కుమార్కు మెట్ట ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
గోదారమ్మకు పూజలు చేసిన ఎమ్మెల్యే సతీశ్కుమార్..
మెట్ట ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న గోదావరి జలాలు ఆదివారం గౌరవెల్లి రిజర్వాయర్లోకి పరుగులు తీసిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సతీశ్కుమార్ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి గంగమ్మకు పూజలు చేశారు. డెలివరీ సిస్టర్న్ నుంచి ఎగిసి పడుతున్న నీళ్ల వద్ద టెంకాయలు కొట్టి, పసుపు, కుంకుమ చల్లి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పూజల సందర్భంగా నాయకులు జైతెలంగాణ, జైకేసీఆర్, జైహరీశ్రావు, జై సతీశ్కుమార్ నినాదాలతో హోరెత్తించారు. పంపుహౌస్, టన్నెల్ నిర్మాణంలో భాగస్వాములై పనులను విజయవంతంగా పూర్తిచేసిన కాంట్రాక్టర్ పెంటారెడ్డితో పాటు ఇంజినీరింగ్ అధికారులను ఎమ్మెల్యే సతీశ్కుమార్ ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్కుమార్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ శంకర్, ఈఈలు రమేశ్, మధు, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, ఎంపీపీలు లకావత్ మానస, మాలోతు లక్ష్మి, కొక్కుల కీర్తి, కొత్త వినీత, ప్రభాకర్రెడ్డి, అనిత, జడ్పీటీసీలు శ్యామల, భూక్య మంగ, వంగ రవీందర్, మున్సిపల్ వైస్చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డి, మార్కెట్ చైర్మన్ కాసర్ల అశోక్బాబు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, నాయకులు వెంకట్రాంరెడ్డి, ఎండీ అన్వర్, తిరుపతిరెడ్డి, పెసరు సాంబరాజు, ఆవుల మహేందర్, రాజయ్య, ఆకుల వెంకట్, వెంకట్రెడ్డి, శ్రీకాంత్, బీలూనాయక్, నియోజకవర్గంలోని సర్పంచ్, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్న్ విజయవంతం కావడంతో హుస్నాబాద్ పట్టణంలో ఆదివారం సాయంత్రం టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే సతీశ్కుమార్ సైతం ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలోని సిద్దిపేట రోడ్డు పెట్రోల్బంక్ నుంచి మల్లెచెట్టు చౌరస్తా, మెయిన్రోడ్డు, అంబేద్కర్ చౌరస్తా, హన్మకొండ రోడ్డు నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. ర్యాలీలో నాయకులు, కార్యకర్తల నృత్యా లు, జైతెలంగాణ, జైకేసీఆర్, జైహరీశ్రావు, జైసతీశ్కుమార్ నినాదాలు హోరెత్తాయి. టీఆర్ఎస్ ప్రభు త్వం, సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది.
రూ.770 కోట్లతో టన్నెల్, పంపుహౌస్ నిర్మాణం..
గౌరవెల్లి రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోసేందుకు నిర్మించిన టన్నెల్, పంపుహౌస్, మోటర్లు, విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం రూ.770 కోట్లు ఖర్చుచేసింది. ఈ నిధులతో కోహెడ మండలం నారాయణపూర్ గ్రామం నుంచి రేగొండ పంపుహౌస్ వరకు 12కి.మీ.ల మేర సొరంగ మార్గాన్ని నిర్మించింది. రేగొండ సమీపంలో రెండు సర్జిఫూల్ ట్యాంకులు, పంపుహౌస్ నిర్మాణం చేసింది. ఇక్కడ 132విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేసి పంపులను రన్ చేసేందుకు పంపుహౌస్ పక్కనే 50ఎంవీఏ సామర్థ్యం కలిగిన 5 భారీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత ఇక్కడే..
పంపుహౌస్లో 32 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 3భారీ మోటర్లను బిగించారు. ఒక్కో మోటరు సెకనుకు 2వేల క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తాయి. మూడు మోటర్లు కలిపి 6 రోజుల్లో టీఎంసీ నీటిని రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తాయి. 126మీటర్ల ఎత్తుకు నీటిని పంపింగ్ చేసే ఇంత భారీ మోటర్లు కాళేశ్వరం తర్వాత రాష్ట్రంలోనే మొదటివి అని అధికారులు చెబుతున్నారు. ఇటీవలే ట్రయల్ రన్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాలతో సాధ్యం కాలేదు. ఎట్టకేలకు ఆదివారం ట్రయల్న్ చేయడంతో రిజర్వాయర్ టన్నెల్ పనులు వందశాతం పూర్తయినట్లేనని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రిజర్వాయర్ కట్ట నిర్మాణ పనులు 95శాతం పూర్తయ్యాయి. మొత్తం కట్ట పొడవు 10.56 కి.మీ.లు కాగా, ఇందులో కేవలం అర కిలోమీటరు పనులు మాత్రమే మిగిలాయి. ఈ పనులు పూర్తయితే రిజర్వాయర్లో పంపుహౌస్ ద్వారా 8.23టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 1.06 లక్షల సాగునీరందనున్నది.