కాలంతో పని లేకుండా రెండు పంటలు పండుతున్నయి..
బీజేపీ, కాంగ్రెస్ వాళ్లది నెత్తి కాదు కత్తి కాదు
ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు
మర్రిముచ్చాలలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డితో కలిసి శంకుస్థాపన
సర్కారు దవాఖానలు, బడుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ
సాధారణ కాన్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలి
నాలుగు మండలాల రోడ్ల మరమ్మతులకు రూ.20కోట్లు
చేర్యాలలో రూ.9కోట్లతో ఆధునిక వైద్యశాల
ముస్త్యాలలో రూ.25లక్షలతో మహిళా భవనం
కొమురవెల్లి, జూన్ 7 : సీఎం కేసీఆర్ పాలనలో కాలంతో పని లేకుండా రెండు పంటలు పండుతున్నాయని ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం మండలంలోని మర్రిముచ్చాలలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, సర్పంచ్ బొడిగం పద్మాకిష్టారెడ్డి, ఎంపీపీ కీర్తన, జడ్పీటీసీ సిద్ధప్పతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణలో ఒకప్పుడు నీళ్ల గోసే ఉండే.. నీళ్లు కావాలంటే బిందెలు పట్టుకొని ట్యాంకర్ల చుట్టూ పోతే సొట్టలు పడుతుండే.. అటువంటిది ఇప్పుడు ఇంట్లో నల్లా తిప్పితే బిందెలో నీళ్లు పడుతున్నాయి. వెనుకట ఆంధ్రలో ఎకరం అమ్మి ఇక్కడ 10 ఎకరాలు కొనేటోళ్లు.. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నిరంతరాయ కరెంట్, నీళ్ల రాకతో ఇక్కడి భూములు పదింతలు రేటు పెరిగాయి. దీంతో సీన్ రివర్స్గా మారి ఇక్కడ ఎకరం అమ్మితే ఆంధ్రలో 5 ఎకరాలు వస్తుంది. తెలంగాణ బార్డర్లో ఉన్న కర్ణాటక రైతులు ఇక్కడ రెండు గుంటల భూమి కొని అందులో బోరు వేసి కిలో మీటర్ల పైప్లైన్ వేసుకొని ఇక్కడి కరెంట్తో పంటలు పండించుకుంటున్నారన్నారు. స్వయంగా కర్ణాటక ఓ బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణలో ఉన్న పథకాలను కర్ణాటకలో అమలు చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించిండు. గిట్లా తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంటే కాంగ్రెస్, బీజేపీ వాళ్లు విమర్శిస్తున్నారు వాళ్లది కత్తి కాదు నెత్తి కాదని విమర్శించారు.
మర్రిముచ్చాలలో రెండు ఉచిత వైద్య శిబిరాలు
త్వరలో మర్రిముచ్చాలలో ఉచితంగా కంటి, మోకాలి వైద్యశిబిరం నిర్వహిస్తామని గ్రామంలో ఉన్న పేదోళ్లకు పైసా ఖర్చు కాకుండా దవాఖానలో రెండు రోజులు వారికి భోజనం పెట్టి ఆపరేషన్లు చేయించి మళ్లీ గ్రామంలో దింపుతామన్నారు. గ్రామంలో ఆశకార్యకర్తలు ఇంటింటికీ తిరిగి వివరాలు నమోదు చేసుకొని ఆపరేషన్ అవసరమైన లిస్టును తయారు చేయాలన్నారు. ఈ శిబిరాలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రసూతి కోసం మహిళలు ప్రభుత్వ దవఖానకు వెళ్లాలని ఆపరేషన్ చేయాలని వైద్యులపై ఒత్తిడి తేవొద్దన్నారు. నార్మల్ డెలివరీ అయితేనే తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారన్నారు. త్వరలో గ్రామంలో నాలుగులేన్ల రోడ్డు పనులు ప్రారంభమైతాయని రోడ్డు అయిన తర్వాత దుద్దెడ నుంచి మర్రిముచ్చాల వరకు బట్టర్ైప్లె లైట్లు వేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గీస భిక్షపతి, వైస్ ఎంపీపీ రాజేందర్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు సద్ది కృష్ణారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు బచ్చల సాయిమల్లు, గ్రామశాఖ అధ్యక్షుడు చదరుపల్లి నర్సింగరావు, పీఏసీఎస్ డైరెక్టర్ బత్తిని నర్సింహులుగౌడ్, మాజీ సర్పంచ్ వంగరాణి, సర్పంచ్లు పచ్చిమండ్ల స్వామిగౌడ్, బీమనపల్లి కరుణాకర్, టీఆర్ఎస్వీ నేత ఏర్పుల మహేశ్, ముత్యం నర్సింహులుగౌడ్, నాయకులు మెరగు కృష్ణాగౌడ్, పుట్ట కనకరాజు, బుడిగె రమేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్యే
సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మర్రిమచ్చాలలో రైతువేదికతో పాటు ఎస్సీకానీలో నిర్మించిన ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన కొమురవెల్లి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటాన్నామని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గీస భిక్షపతి, ముత్యం నర్సింహులుగౌడ్, చదరుపల్లి నర్సింగరావు, బొడిగం వంశీ, ఏర్పుల మహేశ్, తదితరులు పాల్గొన్నారు.