మెదక్/ సంగారెడ్డి నెట్వర్క్, (సెప్టెంబర్ 19) : విఘ్ననాయకుడి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. పల్లెలు, పట్టణాల్లో వివిధ రూపాల్గొన్న గణనాథుడు కొలువుదీరాడు. భక్తులు మండపాలను ఏర్పాటు చేసి వినాయకుడి ప్రతిమలు ప్రతిష్ఠించి వైభవంగా పూజలు చేశారు. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండపాలు అందంగా ముస్తాబు చేశారు.
విద్యుత్ దీపాల వెలుతురులో మండపాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యావరణ రక్షణ కోసం మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయాలని పిలుపునివ్వడంతోపాటు మట్టి ప్రతిమలను పంపిణీ చేశారు. పలుచోట్ల ప్రజాప్రతినిధులు పూజల్లో పాల్గొన్నారు