జగదేవ్పూర్, ఏప్రిల్14: “జగదేవ్పూర్, మర్కుక్ మండలాల్లో పర్యటించి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నా, నేడు ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకొచ్చా ఆదరించి ఆశీర్వదించాలి” అని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. జగదేవ్పూర్, మర్కుక్ మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, మండల నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. కేసీఆర్ సహకారంతో గజ్వేల్ అభివృద్ధిలో 50 ఏండ్లు ముందుకెళ్లిందన్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. తనకు ఓటేసి గెలిపిస్తే రూ.100 కోట్లతో పీవీఆర్ ట్రస్టు ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో ఫంక్షన్హాల్ ఏర్పాటు చేసి ఉచితంగా సేవలందిస్తానన్నారు. నిరుద్యోగ యువత స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఏ ఒక్కటీ అమలుచేయలేదని, ఇప్పటికే ప్రజల్లో కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. వెంకట్రామిరెడ్డిని ఎంపీగా గెలిపించుకోవాలన్నారు. రఘునందన్ మాయమాటలు నమ్మవద్దని సూచించారు. బీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటేసేలా చూడాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో మర్కుక్ ఎంపీపీ పాండుగౌడ్, జడ్పీటీసీలు సుధాకర్రెడ్డి, మంగమ్మారామచంద్రం, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ రంగారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, కరుణాకర్రెడ్డి, కొండపోచమ్మ దేవాలయ మాజీ చైర్మన్లు శ్రీనివాస్రెడ్డి, ఉపేందర్రెడ్డి, నాయకులు యాదవరెడ్డి, సుధాకర్రెడ్డి, బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.