నారాయణఖేడ్/కంగ్టి, ఆగస్టు 5: కంగ్టి మండలంలోని తడ్కల్ గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి శనివారం ప్రస్తావించారు. అధికారిక వికేంద్రీకరణలో భాగంగా నారాయణఖేడ్ను రెవెన్యూ డివిజన్తో పాటు నియోజకవర్గంలో మూడు మండలాలు ఏర్పాటు చేశారన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. కంగ్టి మండలంలోని తడ్కల్ను మండలంగా ఏర్పాటు చేయాలని, దీనికి సంబంధించిన సర్వే ఫైల్ను ప్రభుత్వానికి పంపించామని చెప్పారు.
తడ్కల్ మండల ప్రజల నుంచి డిమాండ్ వస్తున్నదని వారి కోరిక మేరకు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్కు విన్నవించుకున్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పందిస్తూ వెంటనే ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. దీంతో తడ్కల్ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్తోనే తడ్కల్ మండలం ఏర్పాటవుతుందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగారం, సర్పంచ్ మనోహర్, నాయకులు సాయాగౌడ్, నారాయణ తదితరులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.