శివ్వంపేట, మార్చి 24: మండల కేంద్రం శివ్వంపేటలోని బగలాముఖి శక్తిపీఠంలో ఆదివారం శోభకృత్ నామ సంవత్సర చివరి పౌర్ణమి కావడంతో అమ్మవారి ఉపాసకులు శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలలో వేదపండితులు హోమం, అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, హరిద్రార్చన హవనం, పూర్ణాహుతి, మహామంత్రహవనం, మహాపూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులకు జిన్నారం పెద్దగౌని లింగాగౌడ్, అంజమ్మ దంపతుల జ్ఞాపకార్థం హైకోర్టు సీనియర్ న్యాయవాది శివకుమార్గౌడ్ అన్నదానం చేశారు.
కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు శాస్త్రుల పురుషోత్తంశర్మ, వెంకటరమణశర్మ, జిన్నారం పెద్దగౌని శివకుమార్ గౌడ్, పబ్బ మహేశ్గుపప్త్తా, పత్రాల శ్రీనివాస్గౌడ్, ఆలయ ప్రధాన అర్చకులు ఆంజనేయశర్మ, సంతోశ్కుమార్శర్మ, భరద్వాజ్శర్మ, వివేక్ శర్మ, పారిశ్రామికవేత్తలు చాగండ్ల బల్వీందర్, నందకుమార్, కామారెడ్డి శ్రీనివాస్, పోచగౌడ్, కొండల్, విశ్వశ్రీ లా చాంబర్ సిబ్బంది లికిత శ్రీనివాస్, చిన్న, ముద్దగాళ్ల రాజు, రమేశ్ గుప్తా, కిషన్, సత్యనారాయణ గౌడ్, భక్తులు పాల్గొన్నారు.