ఖైరతాబాద్, మే 19: ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించని వారికి షహీన్ అకాడమీతో కలిసి ఉచితంగా ఆన్లైన్ శిక్షణ ఇవ్వనున్నట్లు సోషల్ డేటా ఇన్షియేటివ్ ఫోరం డైరెక్టర్ ఖలీద్ సైఫుల్లా తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరీక్షల్లో విజయం సాధించని విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారని, అలాంటి వారికి నిష్ణాతులైన అధ్యాపకులచే ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఆసక్తి ఉన్న విద్యార్థులు మరింత సమాచారం కోసం 8927911911 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ ఇంతియాజ్, అంజద్, అయేషా, రుబీనా, ఇబ్రహీంఖాన్ తదితరులు పాల్గొన్నారు.