మనోహరాబాద్, జూన్ 1 : గీత కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని జడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్గౌడ్, ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్రెడ్డి అన్నారు. మనోహరాబాద్ మండలకేంద్రంలో రూ. 25 లక్షల అం చనా వ్యయంతో నిర్మించనున్న గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ… గీత కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. గీత కార్మికులకు పెన్షన్, రూ. 5 లక్షల ప్రమాదబీమా, వాహనాలను అం దించడంతోపాటు గీత వృత్తిని కాపాడేందుకు ఐదెకరాల ప్రభుత్వ భూమిలో ఈత వనాలను పెంచుకునేందుకు అవకాశం కల్పించారన్నారు.
సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండడం మన అదృష్టమన్నారు. మనోహరాబాద్ను కొత్త మండలంగా చేయడంతోపాటు కోట్లాది నిధులను మంజూరు చేసి అభివృద్ధి చేశారనిపేర్కొన్నారు. జూన్ 2 నుంచి నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, ఎంపీటీసీ లతావెంకట్గౌడ్, గౌడ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్, బీఆర్ఎస్ నాయకులు నరేందర్గౌడ్, మహేందర్గౌడ్, సాయిరాంగౌడ్, మహిపాల్రెడ్డి, సుధాకర్, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.