మెదక్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేయాలి. కానీ బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ 5వ వార్డు కౌన్సిలర్ మామిండ్ల ఆంజనేయులు ఇంటిని కాంగ్రెస్ నాయకులు ముట్టడించడాన్ని నిరసిస్తూ మెదక్ బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5వ వార్డ్ కౌన్సిలర్ మామిండ్ల ఆంజనేయులు ఇంటి వద్ద కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడటం హేయమైన చర్య అన్నారు. పదేం డ్ల బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి దాడులకు తావులేదన్నారు.
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రెండు టికెట్లు ఇవ్వనందుకు ఒకటేరోజు మూడు కండువాలు మార్చారని గుర్తు చేశారు. భూగర్భ జలాలు తగ్గి రైతుల పంటలు ఎండుతున్న తరుణంలో పంటలను పరిశీలించి రైతులకు ఎకరానికి రూ.25 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలు మంచినీళ్ల కోసం ఇబ్బంది పడుతుంటే దానిగురించి పట్టించుకోకుండా ప్రతిపక్షాల మీద దాడి చేయడం సరికాదన్నారు. తెలంగాణ కోసం 14 ఏండ్లు పోరాటం చేసి సాధించామని, ఇప్పుడు కేసులు పెడితే ఎవరూ భయపడేదిలేదన్నారు. కౌన్సిలర్పై దాడిని నిరసిస్తూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో లావణ్యారెడ్డి, గంగాధర్, మల్లికార్జున్ గౌడ్, మామిండ్ల ఆంజనేయులు, కిశోర్, శ్రీనివాస్, మాధవి, రాజు, లింగారెడ్డి, అశోక్, శ్యామ్సుందర్, లింగం, సతీష్రావు, లక్ష్మిరెడ్డి, శ్రీనివాస్గౌడ్, కుమార్ గౌడ్, శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.