మెదక్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): మెదక్ మాజీ ఎమ్మెల్యే, మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డిని పేట్ బషీరాబాద్ కొంపల్లి పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా హైదరాబాద్ ట్యాంక్బండ్పై ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎకడికకడ బీఆర్ఎస్ శ్రేణుల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి నుంచే నాయకులను హౌస్ అరెస్టులు చేయడంతో పాటు అదుపులోకి తీసుకుంటున్నారు. శుక్రవారం మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిని పేట్ బషీరాబాద్ కొంపల్లి పోలీసులు కొంపల్లిలోని ఆమె నివాసంలో హౌస్ అరెస్టు చేశారు.