పుల్కల్, మే 1: బీఆర్ఎస్ నాయకుల మృతి పార్టీకి తీరని లోటని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. చనిపోయిన కుటుంబాలను పరామర్శించేందుకు శుక్రవారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని పోచారం గ్రామానికి ఆయన వచ్చారు. గ్రామంలో పార్టీ సీనియర్ నాయకుడు లక్ష్మారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ బీరయ్య, అనిల్ ఇటీవల చనిపోవడం దురదృష్టకరమన్నారు. గ్రామం మంచి ముగ్గురు నాయకులను కోల్పోయామన్నారు. మృతిచెందిన అనిల్కు ఇద్దరు చిన్నపిల్లలు ఉండటంతో ఆయన చలించిపోయారు.
ఆఇద్దరు పిల్లల చదువు బాధ్యతలు పార్టీ చూసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విజయ్కుమార్ వైష్ణవి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి వారికి విద్య ఫ్రీగా అందించేందుకు ఒప్పించారు. అంతకు మందు మండలంలోని బస్వాపూర్లో బీఆర్ఎస్ నాయకుడు దుర్గారెడ్డి గృహప్రవేశంలో పాల్గొన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల పోచయ్య, విష్ణు, రైపాడ్ సర్పంచ్ రాజు,సింగూర్ మాజీ సర్పంచ్ రాజాగూడ్, కనకారెడ్డి ఉన్నారు.