మునిపల్లి, ఫిబ్రవరి 7 : రోడ్డు నిబంధనలు పాటించాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్ కుమార్ వాహనదారులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పరిధిలోని కంకోల్ గ్రామ శివారులోని ముంబయి జాతీయరహదారిపై డెక్కన్ టోల్ప్లాజా ఆధ్వర్యంలో బుధవారం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరంచి వాహనాలు నడిపించాలని సూచించారు. నేటి యువత స్పీడ్గా కార్లు నడిపిస్తూ ప్రమాదాల బారినపడుతున్నారని గుర్తుచేశారు. కార్యక్రమంలో కొండాపూర్ సీఐ చంద్రయ్య, సంగారెడ్డి ట్రాఫిక్ సీఐ సుమన్కుమార్, ఎస్సై సురేశ్, డెక్కన్ టోల్ప్లాజా మేనేజర్ రాజేశ్విచారే, సిబ్బంది సంతోష్డోగ్రె, విజయేందర్, నాగరాజు పాల్గొన్నారు.