చేగుంట, డిసెంబర్12: ఊర కుక్కలు అడ్డు రాగా ఆటో బోల్తా పడిన ఘటనలో ఐదుగురికి గాయాలైన ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్ పెద్దమ్మ దేవాలయం సమీపంలో సోమవారం జరిగింది. బాధితులు, చేగుంట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోనాల్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మురాడి నరేశ్ నాలుగురు ప్రయాణికులను ఎక్కించుకుని చేగుంటకు వస్తున్నాడు. ఈ సమయంలో రుక్మాపూర్ గ్రామ సమీపంలోని పెద్దమ్మ దేవాలయం వద్దకు రాగానే రహదారిపై ఆటోకు కుక్క అడ్డు వచ్చింది. దీంతో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో బోనాల్కు చెందిన మురాడి దుర్గయ్య, నరేశ్, కొండపూర్కు చెందిన సౌందర్య, రాములమ్మ, ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన సత్తయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు తూప్రాన్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఆటో డ్రైవర్ నరేశ్కు పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని గాంధీ దవాఖానకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి: ఎంపీ
చేగుంట మండలం రుక్మాపూర్ వద్ద ఆటో బోల్తా పడి ఐదుగురికి గాయాలైన విషయం తెలుసుకున్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి వెంటనే స్పందించి తూప్రాన్ వైద్యులతో ఫొన్లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్సలు అందించాలని సూచించారు. ఆ వెంటనే
స్థానిక ఎమ్మెల్యే రఘునందన్రావు కూడా వైద్యులకు ఫోన్ చేశారు.