గుమ్మడిదల, మే 25 : పారిశ్రామికవాడలో ఓస్క్రాప్గోదాంలో ఒక్కసారిగా అగ్నిమంటలు ఆకాశనంటుతూ ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయందోళనకు గురయ్యా రు. గోదాంలో భారీగా కెమికల్డ్రమ్ములు నిల్వ ఉండడంతో ఎగిసిపడి బాం బుల చప్పుడు గోచరించింది. దీంతో స్థానికులు ఎక్కడ నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని భయబ్రాంతులకు గురైయ్యా రు.
బొంతపల్లి పారిశ్రామికవాడలోని దార్గు ల దాచారం సమీపంలో కుత్బుల్లాపూర్కు చెందిన వ్యక్తులు స్క్రాఫ్గోదాంను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇందులో భారీగా స్థానిక పరిశ్రమలనుంచి తెచ్చిన కెమికల్ డ్రమ్ములు నిల్వ ఉంచడంతో శనివారం సాయంత్రం ప్రమాదవశాత్తు అగ్నిపంటలు సంభవించాయి. ఎవరికి ఎలాంటి ప్రాణపాయం జరుగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఎలాంటి అనుమతులు లే కుండా భారీస్థాయిలో స్క్రాఫ్గోదాంను ఏ ర్పాటు చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.