సిద్దిపేట, ఫిబ్రవరి 21: సిద్దిపేట, దుబ్బాక పట్టణాలు బుధవారం రాత్రి నుంచి గంటలపాటు అంధకారంలోకి వెళ్లాయి. సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో బుధవారం రాత్రి 7గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఈ ప్రమాదంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సబ్స్టేషన్లోని ట్రాన్స్ఫార్మర్లు పేలడంతో పెద్ద ఎత్తున మంటలు రేగాయి. దీంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిసింది. విద్యుత్ ట్రిప్ కావడంతో ప్రమా దం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం విష యం తెలియగానే సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ప్రమాదానికి గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంటలు అదుపులోకి తెచ్చేందుకు విద్యుత్, రెవెన్యూ, మున్సిపల్, ఫైర్ అధికారులకు పలు సూచనలు చేశారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నుంచి నాలుగు అగ్నిమాపక యంత్రాలను తెప్పించి రాత్రి వరకు మంటలను అదుపులోకి తెచ్చా రు. రాత్రి వరకు హరీశ్రావు, కొత్త ప్రభాకర్రెడ్డి ఘటనా స్థలంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించారు. ఘటనా స్థలం నుంచే విద్యుత్శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్కతో హరీశ్రావు ఫోన్లో మాట్లాడి పరిస్థితి వివరించారు. మంటలు అదుపులోకి రావడంతో విద్యుత్ అధికారులు రాత్రి 10.45 గంటలకు కరెంట్ను పునరుద్ధరించారు.