నంగునూరు, ఫిబ్రవరి 28: కారు వేగంగా వచ్చి బైకును ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందిన ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్ క్రాసింగ్ వద్ద బుధవారం జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం… బద్దిపడగ రాంపూర్ క్రాసింగ్ వద్ద శ్రీనిధి రైస్మిల్లు సమీపంలో కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రాంపూర్ నుంచి బద్దిపడగకు బైక్పై వెళ్తున్న నంగునూరు మండలం బద్దిపడగకు చెందిన కట్టె రవి(55), నాగరాజుపల్లికి చెందిన ముక్కెర ఐలయ్య (60), కారులో ప్రయాణిస్తున్న కొండపాక మండలం దుద్దెడకు చెందిన జక్కుల మమత(28) అకడికకడే మృతిచెందారు. కారులో ఉన్న మమత భర్త అనిల్, పిల్లలు భానుప్రసాద్, వైష్ణవి, అనిల్ బావమరిది బాపురాజు, భార్య కీర్తన, వారి పిల్లలు నాన్సి, హన్విక, అనిల్ అన్న కొడుకులు చరణ్, ప్రణయ్ గాయపడ్డారు. వీరిని సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే కారు వేగంగా వచ్చి బైక్ను ఢీకొట్టి రోడ్డు పకన ఉన్న కాలువలో పడింది. ప్రమాద తీవ్రతకు కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. రాజగోపాల్పేట ఎస్సై భాస్కర్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరికొద్దిసేపట్లో ఇంటికి చేరుకుంటారనగా అంతలోనే మృత్యువు వారిని కబళించింది. దుద్దెడ గ్రామానికి చెందిన జక్కుల మమత-అనిల్ కుటుంబం హుస్నాబాద్లో జరిగిన ఓ వివాహానికి వెళ్లివస్తుండగా రాంపూర్ క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మమత అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె మృతితో బంధువుల రోదనలు దవాఖాన వద్ద మిన్నంటాయి.