కొమురవెల్లి, ఏప్రిల్ 7: గడిచిన పదేండ్లలో ఎన్నడూ లేనివిధంగా రైతులకు సాగునీటి కష్టాలు వేధిస్తున్నాయి. నీరందక పంటలు ఎండుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు పంటలను కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లికి చెందిన దేశెట్టి కనకయ్య అనే రైతు తనకున్న నాలుగు ఎకరాల్లో ముందుచూపుతో రెండెకరాల్లోనే వరి సాగు చేశారు.
ఆ రెండు ఎకరాల్లో సగం పంట ఎండిపోయిది. మిగతా ఎకరం ఎండిపోకుండా రెండు రోజులకోసారి రూ.4వేలు ఖర్చుపెట్టి ఐదు నీళ్ల ట్యాంకర్ల ద్వారా వరి పంటకు తడిపెడుతున్నాడు. కరెంట్ కోతలు, భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలకు నీరందని పరిస్థితి ఉందని, దీంతో ట్యాంకర్ల ద్వారా నీరుపెడుతున్నట్లు రైతు దేశెట్టి కనకయ్య తెలిపారు.