సంగారెడ్డి/మెదక్ న్యూస్నెట్వర్క్,ఫిబ్రవరి 14;రెండో విడత ‘కంటివెలుగు’లో మెదక్ జిల్లా లక్ష మార్కుకు చేరుకున్నది. పద్దెనిమిది రోజులుగా కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుండగా, ప్రజలు శిబిరాలకు పెద్ద ఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని 69 శిబిరాల్లో 13,800 మందికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. మెదక్ జిల్లాలో 6244 మందికి టెస్ట్లు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి రోజూ శిబిరాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, వైస్ చైర్పర్సన్ పుట్టి విజయలక్ష్మి, కమిషనర్ ఉమాదేవి అన్నారు. పట్టణంలోని 11వ వార్డులో మంగళవారం కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, వైద్యులు హరిప్రియ, శ్రావణి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రం, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, కౌన్సిలర్లు గంగాధర్, అనిల్కుమార్, సుందర్సింగ్, వార్డు ఆఫీసర్ శ్రీనివాస్, వైద్యసిబ్బంది నర్సింహులు, కిషన్, సత్తమ్మ, సునంద, ఆర్పీలు లావణ్య, రజిత, బాలమ ణి, డీఈవో భరత్, ఏఎన్ఎంలు బాలలక్ష్మి, బాలమణి, లక్ష్మి, రమ, ఆశవర్కర్లు లక్ష్మి, పద్మ, శోభ, అనిత, నాయకులు యాదగిరి, కొండల్రెడ్డి, కిషన్, రాజు పాల్గొన్నారు.
‘కంటి వెలుగు’ పేదలకు వరం : ఎంపీపీ స్వప్న
తూప్రాన్ మండలంలోని ఘనపూర్లో కంటివెలుగు కార్యక్రమాన్ని సర్పంచ్మిద్దింటి పుష్పానవీన్తో కలిసి ఎంపీపీ స్వప్నావెంకటేశ్యాదవ్ ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. కంటి వెలుగు పేదలకు వరమన్నారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆనంద్, ఎంపీడీవో అరుంధతి, ఉప సర్పంచ్ ఆకుల రవి పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి : ఎంపీడీవో గణేశ్రెడ్డి
కొల్చారం మండల కేంద్రంలోని కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీడీవో గణేశ్రెడ్డి, మెడికల్ ఆఫీసర్ రమేశ్ పర్యవేక్షించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలనిన్నారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ శైలేందర్, సిబ్బంది సంగీత, ప్రవీణ, ఆశ వర్కర్లు ఉన్నారు.
రూప్లతండా కంటివెలుగు ప్రారంభం
శివ్వంపేట మండలంలోని రూప్లతండాలో కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ రాంసింగ్తో కలిసి ఎంపీపీ కల్లూరి హరి కృష్ణ ప్రారంభించారు. కంటివెలుగు శిబిరాలతో కంటి చూపు సమస్యలు తీరుతాయ న్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో నవీన్కుమార్, మాజీ సర్పంచ్ రూప్లనాయక్ పాల్గొన్నారు.
చిన్నశంకరంపేట మండల పరిధిలోని ఎస్.కొండాపూర్లో సర్పంచ్ శశికళ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంధత్వ నివారణకు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని సర్పంచ్ శశికళ తెలిపారు.
చూపు సమస్యలకు పరిష్కారం : ఎంపీపీ నారాయణరెడ్డి
హవేళీఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, సర్పంచ్ భాగ్యాశ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. కంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఉ చితంగా పరీక్షలు నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ అర్చనాశ్రీనివాస్ ఉన్నారు.
గౌతాపూర్లో కంటి వెలుగు ప్రారంభం..
చిలిపిచెడ్ మండలంలోని గౌతాపూర్లో కంటి వెలుగు శిబి రాన్ని ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి, ఎంపీడీవో శశిప్రభ ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ స్వరూప, ఎంపీటీసీ సునీత, కార్యదర్శి దుర్గ, వైద్యురాలు సృజన పాల్గొన్నారు.