దృష్టిలోపం ఉన్న వారికి భరోసా కల్పిస్తూ సీఎం కేసీఆర్ ప్రవేశపట్టిన రెండో విడత కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. పద్దెనిమిదేండ్లు పైబడిన వారంతా శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో 76వ రోజు సోమవారం గ్రామాల్లో 8,537, పట్టణాల్లో 2,605, జీహెచ్ఎంసీ పరిధిలో 253 మందికి వైద్యులు కంటి పరీక్షలు చేయగా, 543 మందికి కండ్లద్దాలు అందజేశారు. మెదక్ జిల్లాలో 29 బృందాలు 4,176 మందికి టెస్ట్లు నిర్వహించి 300 మందికి అద్దాలు పంపిణీ చేశారు.
– సంగారెడ్డి (నమస్తే తెలంగాణ)/
మెదక్ అర్బన్, మే 15
మెదక్ అర్బన్/సంగారెడ్డి (నమస్తే తెలంగాణ)/ సిద్దిపేట, మే 15 : రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 4,06,417 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 1,92,970 పురుషులు, 2,13, 447 మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు 38,000 మందికి కండ్లద్దాలను పంపిణీ చేశారు. మరో 37,927 మందికి కండ్ల అద్దాల కోసం ఆర్డర్లు ఇచ్చారు. సోమవారం 76వ రోజు 29 బృందాలు 4176 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 300 మందికి కండ్ల అద్దాలను పంపిణీ చేశారు. మ రో 276 మంది అద్దాల కోసం ఆర్డర్లు పెట్టుకున్నట్లు మెదక్ డీఎంహెచ్వో చందునాయక్ తెలిపారు.
సిద్దిపేట జిల్లాలో 5471 మందికి ..
సిద్దిపేట జిల్లాలో రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం సోమవారం 76వ రోజు జిల్లా వ్యాప్తంగా కొనసాగింది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 35 గ్రామాలతో పాటు 5 మున్సిపాలిటీల్లో 10 వార్డుల్లో కంటి వెలుగు శిబిరంలో ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఆద్దాలను అందజేశారు. మొత్తం 45 బృందాలు కంటి పరీక్షలు నిర్వహించారు.
సంగారెడ్డి జిల్లాలో 11395 మందికి కంటి పరీక్షలు
సంగారెడ్డి జిల్లాలో కంటివెలుగు వైద్య శిబిరాల్లో సోమవారం 11,395 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. 5581 మంది పురుషులు, 5814 మంది మహిళలకు కంటి పరీక్షలు చేశారు. గ్రామాల్లో 8537 మంది, పట్టణాల్లో 2605 మం ది, జీహెచ్ఎంసీ పరిధిలో 253 మంది కంటీ పరీక్షలు చేయించుకున్నారు. 252 మంది మహిళలు, 291 మంది పురుషులు కండ్లద్దాలు అందజేశారు. 519 మందికి ప్రస్కిప్షన్ అద్దాలు ఆర్డర్ చేశారు. 840 మందికి కంటి ఆపరేషన్లు చేయించుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు.