సంగారెడ్డి కలెక్టరేట్/మెదక్, మే 25 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,36,068 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందు లో పురుషులు 2,07,435 మంది కాగా, మహిళలు 2,28,633 మంది ఉన్నారు. ఇదిలావుండగా ఇప్పటి వరకు 40,209 మందికి కంటి అద్దాలను పంపిణీ చేయగా, మరో 40వేల మందికి ఆర్డర్లు ఇచ్చారు. జిల్లాలో 84వ రోజు గురువారం 23 బృందాలు పాల్గొనగా, 2955 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 178 మందికి కండ్లద్దాలు పంపిణీ చేయగా, 208 మందికి ఆర్డర్లు ఇచ్చామని డీఎంహెచ్వో చందునాయక్ తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో : సంగారెడ్డి జిల్లాలో కంటి వెలుగు విజయవంతంగా కొనసాగుతున్నది. గురువారం జిల్లాలో మొత్తం 9,572 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో 7,994 మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేయగా, వీరిలో 3,876 మంది పురుషులు, 4,118 మంది మహిళలు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో మొత్తం 1,223 మందికి కంటి పరీక్షలు చేయగా, అందులో 563 మంది పురుషులు, 660 మంది మహిళలు ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 207 మంది పురుషులు, 148 మంది మహిళలు మొత్తం 355 మందికి కంటి పరీక్షలు చేశారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 415 మంది కి రీడింగ్ కంటి అద్దాలు పంపిణీ చేయగా, 402 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు అందజేశారు. 802 మందికి కంటి శస్త్ర చికిత్స కోసం రెఫర్ చేశామని జిల్లా వైద్య ఆరో గ్య శాఖ అధికారులు తెలిపారు.