జహీరాబాద్, డిసెంబర్ 23: గోవా మద్యం అక్రమంగా రాష్ట్రంలోకి రాకుండా నివారించేందుకు రాష్ర్ట సరిహద్దులో ఎక్సైజ్ చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్నామని సంగారెడ్డి ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అశోక్కుమార్ తెలిపారు. శుక్రవారం చిరాగ్పల్లి రాష్ట్ర సరిహద్దు ఎక్సైజ్ చెక్పోస్టు వద్ద వాహనలు తనిఖీలు నిర్వహించామన్నారు.
గోవా నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సులో 28 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అక్రమంగా ట్రావెల్స్ బస్సులు, కారులు, ప్రైవేట్ వాహనాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, గోవాకు చెందిన మద్యం హైదరాబాద్కు తరలిస్తున్నారనే సమాచారంతో వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. కొత్త సంవత్సరం వేడుకల కోసం అక్రమంగా గోవా మద్యం హైదరాబాద్కు తరలించకుండా నివారించేందుకు తనిఖీలు చేస్తున్నామన్నారు. తనిఖీల్లో జహీరాబాద్ ఎక్సైజ్ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.