సంగారెడ్డి, ఫిబ్రవరి 9 : మహా శివరాత్రి పర్వదినానికి జ్యోతిర్వాసు విద్యాపీఠం ఆశ్రమంలో జరిగే సైకత లింగం దర్శనానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. గురువారం ఆశ్రమంలో ఏర్పాటు చేస్తున్న సైకత లింగాన్ని కలెక్టర్ శరత్ కుమార్ ఆవిష్కరించారు. ఈ లింగం మహాశివరాత్రి రోజున భక్తుల సందర్శనానికి తీర్చిదిద్దుతున్నారు. లింగం తయారీకి 370 టన్నుల ఇసుకతో 19.5 అడుగుల ఎత్తున సిద్ధం చేశారు. ఈ వేడుకలను పురస్కరించుకొని నాలుగు రోజుల కార్యచరణను వ్యవస్థాపకులు మహేశ్వర శర్మ సిద్ధ్దాంతి దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు.
తొలి రోజు 16న ఉదయం 5 గంటల నుంచి నీలకంఠేశ్వఆరరాధనతో మొదలుకొని రాత్రి 11 గంటలకు మహాహారతి నిర్వహిం చనున్నారు. 17న ఉదయం 5 గంటలకు విజయేశ్వరారాధనతో ప్రారంభమై రాత్రి 11 గంటలకు మహాహారతి, 18న ఉదయం సైకతలింగ మహాభిషేకంతో ప్రారంభమై రాత్రి 12 గంటలకు మహాపూజ తదితర కార్యక్రమాలు కొనసాగుతాయి. 19న ఉదయం 6.41 గంటలకు మహాభిషేకం సమాప్తి కార్యక్రమంతో ప్రారంభమై రాత్రి 8.30గంటలతో మహా ప్రసాద వితరణతో ముగుస్తుంది.