కొల్చారం, డిసెంబర్ 13: ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తప్పకుండా వేసుకోవాలని కొల్చారం మెడికల్ ఆఫీసర్ రమేశ్ అన్నారు. మండల పరిధిలోని అప్పాజిపల్లిలో సోమవారం కొవిడ్ వ్యాక్సినేషన్ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ ఒమిక్రాన్ పై అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. అప్పాజిపల్లిలో మొద టి విడుత కొవిడ్ టీకా వందశాతం పూర్తికాగా, రెండోవిడుత 52 శాతం మంది తీసుకున్నారన్నారు. ఈ రోజు 301 మందికి టీకా వేశామన్నారు. టీకా తీసుకోనివారు తప్పకుండా తీసుకోవాలని కోరారు.
నిజాంపేటలో..
మండలంలో18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేసుకోవాలని హెల్త్ సూపర్వైజ ర్ శ్యామల అన్నారు. నందిగామ లో ఆమె వైద్య సిబ్బందితో కలిసి గ్రామస్తులకు కరోనా టీకా వేశారు. ఈ సందర్భంగా హెల్త్ సూపర్ వైజర్ మాట్లాడుతూ కరోనా టీకాతో ఆరోగ్యం సురక్షితమని, టీకా వేసుకోవడంతో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు.కార్యక్రమంలో ఎంపీటీసీ సురేశ్, పంచాయతీ కార్యదర్శి ఆరిఫ్ హుస్సేన్, ఆశ వర్కర్ ,గ్రామస్తులు రాజ్గోపాల్, దయాకర్ ఉన్నారు.
చిలిపిచెడ్లో…
మండల కేంద్రం లో, చండూర్,చిట్కుల్, సోమక్కపేటలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యా క్సినేషన్ కార్యక్రమానికి స్పందన వ చ్చిదని ఎంపీవో పోలేశ్వర్రాజు అ న్నారు. కొవిడ్ టీకా వేసుకునేందుకు గ్రామంలో స్వచ్ఛందంగా పారిశుధ్య కార్మికులు,ప్రజలు, రైతులు పెద్ద ఎత్తు న వచ్చారన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉన్న వారు అందరూ మొదటి ,రెండో డోసు తీసుకోనివారు ఉంటే తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి భాస్కర్, వైద్యా సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలి
18 సంవత్సరాల దాటిన ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి అన్నారు. మున్సిపల్ పరిధిలోని ప్రైవేట్ కళాశాలలో కొవిడ్ వ్యాక్సిన్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొదటి డోస్ తీసుకున్న వారు రెండో డోస్ తీసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని , చేతులను శుభ్ర పరుచుకోవాలని వెల్లడించారు. అనంతరం ఇంటింటి వ్యాక్సిన్ సర్వేను పరిశీలించారు. కార్యక్రమంలో ఎన్విరాల్మెంట్ ఇంజినీర్ మధు, శానిటరీ ఇన్స్పెక్టర్ మురళీ, మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు.