హుస్నాబాద్, ఏప్రిల్ 15: కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన అక్కన్నపేట మండలం, హుస్నాబాద్ పట్టణ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలపై గ్రామాల్లో వివరిస్తూ ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. ఇంటింటికెళ్లి బీఆర్ఎస్ పాలన, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన పనుల గురించి చర్చపెట్టాలన్నారు.
గతంలో కరీంనగర్ ఎంపీగా వినోద్కుమార్ చేసిన అభివృద్ధి పనులనూ గ్రామగ్రామాన వివరించాలన్నా రు. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి వినోద్కుమార్కు భారీ మెజార్టీ ఇవ్వడంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం అక్కన్నపేట మండలం, హుస్నాబాద్ పట్టణ ఎన్నికల సమన్వయ కమిటీలను నియమించారు. సమావేశంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్ చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, అక్కన్నపేట ఎంపీపీ మాలోతు లక్ష్మీబీలూనాయక్, జడ్పీటీసీ భూక్యా మంగ, బీఆర్ఎస్ నాయకులు ఎండీ అన్వర్, చిట్టి గోపాల్రెడ్డి, సుద్దాల చంద్రయ్య, బండి పుష్ప, కన్నోజు రామకృష్ణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.