దివ్యాంగులు సకలాంగులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. వారి మనోధైర్యం, ఆత్మైస్థెర్యం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడాపోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతికూలతలను అధిగమిస్తూ అసమాన విజయాలను సాధించే దివ్యాంగులు ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తారన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 19 : సమాజంలో దివ్యాంగులు సకలాంగులతో సమానంగా అన్నిరంగాల్లో రాణిస్తున్నారని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. దివ్యాంగులు మనోధైర్యం, ఆత్మైస్థెర్యం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడాపోటీలను జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతికూలతలను అధిగమిస్తూ అసమాన విజయాలను సాధించే దివ్యాంగులు ఎంతోమందికి స్ఫూర్తిప్రదాతలుగా నిలుస్తారన్నారు. జిల్లాస్థాయి దివ్యాంగుల ఆటలపోటీల్లో శారీరక వైకల్య సమస్యలను అధిగమించి ఉత్సాహంగా పాల్గొంటున్న వారందరినీ అదనపు కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సంధ్యారాణి, జిల్లా యువజన క్రీడల అధికారి రామచందర్రావు, డీఆర్డీవో అదనపు పీడీ సూర్యారావు, సీడీపీవోలు, దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు, పీఈటీలు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వలంటీర్లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.