పాపన్నపేట, సెప్టెంబర్ 2 : ఆసరా పింఛన్లు ఎంతో మందికి కొండంత భరోసా ఇస్తున్నాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలకేంద్రం పాపన్నపేట లో లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ.. వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత కార్మికులకు ఆసరా పింఛన్ ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. సీఎం కేసీఆర్ ఆపదలో ఉన్నవారికి ఆసరా పిం ఛన్లు ఇస్తూ ఆదుకుంటున్నారన్నారు. ప్రతి ఒక్కరూ సీఎం కేసీఆర్కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభు త్వం రాష్ర్టానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా తెలంగాణలో సంక్షేమ పథకాలను అడ్డుకోవాలని చూస్తుందని ఆరోపించారు. పాపన్నపేట మండలంలోని 36 గ్రామ పంచాయతీల కింద 1545 మంది లబ్ధ్దిదారులకు ఆసరా ఫించన్ గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అందజేశారు. కార్యక్రమం లో ఎంపీపీ చందనాప్రశాంతరెడ్డి, సర్పంచ్లఫోరం మండలాధ్యక్షుడు కుమ్మరి జగన్, పాపన్నపేట సర్పంచ్ గురుమూర్తిగౌడ్, నార్సింగి సర్పంచ్ ప్రమీల, ఏడుపాయల ఆలయ మాజీ చైర్మన్ గోపాల్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు కుభేరుడు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, కో ఆప్షన్ సభ్యు డు గౌస్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎం పీవో లక్ష్మీకాంతారెడ్డి, నాయకులు, దుర్గయ్య, బాబర్పటేల్ పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలే ఆశీర్వదిస్తాయి : ఎమ్మెల్యే మదన్రెడ్డి
కౌడిపల్లి, సెప్టెంబర్ 2 : సంక్షేమ పథకాలే సీఎం కేసీఆర్ను ఆశీర్వదిస్తాయని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి పేర్కొన్నారు. కౌడిపల్లిలోని లక్ష్మీనర్సింహ ఫంక్షన్హాల్లో కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదలకు అనేక సంక్షేమ పథకాలను అందించి, ఆసరాగా ఉంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలను సైతం అమలు చేస్తున్నా రని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్నారన్నారు. కౌడిపల్లి మండలానికి 1030 కొత్తగా పింఛన్ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. మిగిలిన వారికి త్వరలోనే పంపిణీ చేస్తామన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కౌడిపల్లిలోని ముదిరాజ్ భవనానికి భూమిపూజ చేసి, భవన నిర్మాణానికి రూ.20లక్షలు మంజూ రు చేశారు. మిషన్ భగీరథ వాటర్ ట్యాంకును ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ రాజునాయక్, జడ్పీటీసీ కవిత, సర్పంచ్ ఫోరం మండలాధ్యక్షుడు వెంకటేశ్వర్రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రామాగౌడ్, ఎంపీటీసీల పోరం మండలా ధ్యక్షుడు ప్రవీణ్కుమార్, తహసీల్దార్ వెంకటేశం, ఎంపీడీవో భారతి, కో ఆప్షన్ సభ్యుడు అహ్మద్, సొసైటీ వైస్ చైర్మన్ చిన్నంరెడ్డి, సర్పంచ్ ఎల్లం, వనజాశ్యాంసుందర్, నాయకులు చంద్రం కృష్ణగౌడ్, దుర్గారెడ్డి, కాంట్రాక్టర్ నాయికోటి లింగం, సొసైటీ డైరెక్టర్ మల్లేశ్ ముదిరాజ్, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.
నందిగామలో పింఛన్ పత్రాల పంపిణీ
నిజాంపేట, సెప్టెంబర్ 2 : మండలంలోని నందిగామ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ప్రీతి లబ్ధిదారులకు పింఛన్ పత్రాలను అందజేశారు. పింఛన్ మంజూరుతో లబ్ధిదారుల కండ్లల్లో ఆనందం కనిపిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సురేశ్, కార్యదర్శి ఆరిఫ్ హుస్సేన్, మాజీ సర్పంచ్ సంగుస్వామి, ఉప సర్పంచ్ రాజం ఉన్నారు.
పేదలకు ఆసరా ఇవ్వాలన్నదే ప్రభుత్వ ధ్యేయం
హవేళీఘనపూర్, సెప్టెంబర్ 2 : పేద ప్రజలకు పెన్షన్ ఇస్తూ టీఆర్ఎస్ ఆసరాగా నిలుస్తున్నదని సర్పంచ్ సవిత అన్నారు. హవేళీఘనపూర్లో పెన్షన్ పత్రాలను ఇంటింటికీ తిరిగి అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోహన్గౌడ్, వార్డు సభ్యులు గణపతి, దుర్గయ్య, కృష్ణ, శ్రీను పాల్గొన్నారు.
రేపు చిలిపిచెడ్లో పింఛన్ల పంపిణీ
హాజరుకానున్న ఎమ్మెల్యే మదన్రెడ్డి
చిలిపిచెడ్, సెప్టెంబర్ 2 : మండలకేంద్రంలోని రైతు వేదిక (శీలాంపల్లి)లో ఆసరా పింఛన్ల మంజూరు పత్రాల ను లబ్ధిదారులకు ఆదివారం ఎమ్మెల్యే మదన్రెడ్డి పంపిణీ చేస్తారని వైస్ ఎంపీపీ విశ్వంభరస్వామి, టీఆర్ఎస్ మండ లాధ్యక్షుడు అశోక్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలానికి కొత్తగా 586 పింఛన్లు మంజూరయ్యాయన్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు చిలిపిచెడ్ రైతు వేదికలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేస్తారన్నారు.