సిద్దిపేట అర్బన్, మార్చి 18: అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటించాలని సిద్దిపేట కలెక్టర్ ఎం.మను చౌదరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చాయన్నారు. అన్ని రాజకీయ పార్టీలు నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు.
ఎన్నికల ప్రక్రియలో వివిధ అనుమతులకు సంబంధించి సువిధా యాప్లో ఆన్లైన్తో పాటు నేరుగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎన్నికల ప్రక్రియపై నిఘా ఉంచేందుకు కలెక్టరేట్లో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. 85 ఏండ్ల పైబడిన వారికి హోమ్ ఓటింగ్కు అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) శ్రీనివాస్రెడ్డి, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.