మెదక్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే అర్హులైన ప్రతిఒకరికీ తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ ఆదేశించారు. శనివారం ఆయన జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, కలెక్టర్ రాహుల్రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మెదక్ ఆర్డీవో రమాదేవి, నర్సాపూర్ ఆర్డీవో, తూప్రాన్ ఆర్డీవో, జయచంద్రారెడ్డి, డీఈవో రాధాకృష్ణ, స్వీట్ నోడల్ అధికారి రాజిరెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వికాస్రాజ్ మాట్లాడుతూ.. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ వద్ద తప్పనిసరిగా ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ముగిసిన వెంటనే ఉద్యోగులందరికీ తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరం మేర అదనపు ఫారం 12లు సిద్ధం చేసుకోవాలని, ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించే సమయంలో కంప్యూటర్లు ఏర్పాటు చేసి ఫారం-12 అందజేసి ఉద్యోగి ఆప్షన్ తీసుకోవాలని సూచించారు.
ఓటుహకు వినియోగించుకోవడం కోసం ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేస్తామని, దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసిందని తెలిపారు. ఉద్యోగుల నుంచి ఫారం 12 తీసుకొని ఆన్లైన్లో నమోదుకు ప్రత్యేక అధికారిని కేటాయించాలని, ఆన్లైన్లో నమోదు చేసిన ఫారం 12 సంబంధిత పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికాఅర్హులకు పోస్టల్ బ్యాలెట్ కల్పించాలి వీసీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్రుల వద్దకు వెళ్తాయని తెలిపారు.
ఏప్రిల్ 29 నాటికి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను రిటర్నింగ్ అధికారులు సమర్పించాల్సి ఉంటుందని, ఫారం 7ఏ సీఈవో కార్యాల యం ధ్రువీకరించిన తర్వాత ఏప్రిల్ 30 నుంచి మే 1 వరకు రిటర్న్ అధికారి స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లను ప్రింట్ చేయాలని ఆదేశించారు. పార్లమెంట్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో మే 3న, పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో మే 4 నుంచి మే 8 వరకు ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు స్వీకరించాలని కోరారు. పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి ఫారం-12 సమర్పించి ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది తమ ఓటు హకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా పొందవచ్చని సూచించారు. అత్యవసర సేవల్లో పాల్గొనే సి బ్బందికి సైతం ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద ఓటు హకు వినియోగించుకునే అవకాశం సీఈసీ కల్పించిందని వికాస్రాజ్ తెలిపారు.
85 ఏండ్లు పైబడి పూర్తిగా నడవలేని సీనియర్ సిటిజన్లకు, నడవలేని దివ్యాంగులకు, కోవిడ్ పేషెంట్లుకు ఇంటి వద్దనే ఓటు హకు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టిందని, ఇంటివద్ద ఓటు హకు వినియోగించు కోవాలనుకునేవారు ఏప్రిల్ 23లోగా ఫారం-12డీ సమర్పించాలని వికాస్రాజ్ సూచించారు. రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో దరఖాస్తులను పరిశీలించి ఇంటి వద్ద ఓటు హకు వినియోగించుకునే అర్హులను ఏప్రిల్ 25 నాటికి ఎంపిక చేస్తారని, ఏఆర్వోలు షెడ్యూల్ రూపొందించి బూత్ స్థాయి అధికారుల ద్వారా ఇంటికి వచ్చి షెడ్యూల్ సమాచారం ఓటర్లకు అందిస్తామని తెలిపారు. మే 3 నుంచి మే 6 వరకు మొదటి దశ, మే 8న రెండో దశ ఇంటి వద్ద పోలింగ్ పూర్తి చేస్తామని వికాస్రాజ్ తెలిపారు.