మెదక్, మార్చి 30(నమస్తే తెలంగాణ): ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని అధికారులకు మెదక్ పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. మెదక్ కలెక్టరేట్లోని రూం నెం. జి1లో శనివారం జిల్లా అదనపు ఎన్నికల అధికారి వెంకటేశ్వర్లుతో కలిసి ఎంసీఎంసీ మీడియా సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాస్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఎంసీఎంసీ సెల్ ద్వారా చెల్లిం పు వార్తలను గుర్తించడం, ప్రచురణ, ముంద స్తు అనుమతి లేకుండా ప్రకటన ప్రసారం చేయడం సంబంధిత అభ్యర్థి ప్రచార వ్యయం లో లెకించడం, సోషల్ మీడియాలో అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రకటన వంటి వాటిని సకాలంలో ఆమోదిస్తూ మంజూరు చేయాలని సూచించారు. శాటిలైట్ ఛానల్స్లో వచ్చే వార్తలను పూర్తిస్థాయిలో రికార్డు చేయాలని ఆదేశించారు. వార్తా పత్రికలు, ఈ పేపర్లు, టెలివిజన్ ఛానళ్లు, స్థానిక కేబుల్ నెట్వర్క్, సోషల్ మీడియా, మూవీహౌస్లు సంక్షిప్త సందేశాలు ఇతర ఆడియో వీడియో విజువల్ మీడియాలతో సహా ప్రకటనలు ఎంసీఎంసీ నుంచి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే విడుదల చేయాలన్నారు.
జిల్లాలో ఎన్నికలు నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించేందుకు మీడియా సహకారం అందించాలని కోరారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టిసారించాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్త లు, ప్రకటనలు ప్రసారం చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రచురితమయ్యే రాజకీయ ప్రకటనలు పరిశీలించి పెయిడ్ న్యూస్ పరిశీలనకు మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. వివిధ రాజకీయ పార్టీలు, లేదా అభ్యర్థులు చేసే ప్రలోభాలు నగదు, మద్యం, చీరలు, వస్తువుల లాంటి సంబంధించిన ఫిర్యాదులను 1950 టోల్ ఫ్రీకి సమాచారం ఇవ్వాలని, 24గంటలు అందుబాటులో ఉంటుం దని, ప్రజలు సంప్రదించాలని సూచించారు. ఎన్నికల ప్రచార అనుమతుల కోసం సువిధ ఆన్లైన్ పోర్టల్లో దరఖాస్తు చేసుకొని, సులభంగా అనుమతి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఎలక్షన్ సూపరింటెండెంట్ హర్దీప్సింగ్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, నోడల్ అధికారులు, ఎలక్షన్స్ సిబ్బంది పాల్గొన్నారు.