బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో ముందుండి ఫేక్న్యూస్, దుష్ర్పచారాన్ని తిప్పికొట్టాలని తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ (టీఎస్టీఎస్సీ) చైర్మన్ పాటిమీద జగన్మోహన్రావు పిలుపునిచ్చారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ సోషల్ మీడియా వర్క్షాప్లో పాల్గొని మాట్లాడారు. సెల్ఫోన్ వినియోగం వంద రెట్లు పెరిగిందని, ప్రతి ఓటరూ సోషల్ మీడియాను దగ్గరగా పరిశీలిస్తున్నాడని చెప్పారు. సోషల్ మీడియా వారియర్స్గా మీరు బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
– పటాన్చెరు, ఆగస్టు 27
పటాన్చెరు, ఆగస్టు 27: చేసిన అభివృద్ధిని సోషల్ మీడియాలో చూపాలని, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ (టీఎస్టీఎస్సీ) చైర్మన్ పాటిమీద జగన్మోహన్రావు పిలుపునిచ్చారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అధ్యక్షతన పటాన్చెరు నియోజకర్గ సోషల్ మీడియా వర్క్షాప్ను పార్టీ శ్రేణులతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రజంటేషన్ను తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు బీఆర్ఎస్ శ్రేణులకు వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సోషల్ మీడియా వర్క్షాప్ బీఆర్ఎస్ శ్రేణులకు గొప్ప వరం అన్నారు.
సెల్ఫోన్ వినియోగం వందరెట్లు పెరిగిందని, ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటున్నదని తెలిపారు. ప్రతి ఓటరూ సోషల్ మీడియాను దగ్గరగా పరిశీలిస్తున్నాడని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. ప్రతి గడపలో సంక్షేమం, ప్రతి ఇంటి ముంగిట అభివృద్ధి చేపడుతూ సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పారని పేర్కొన్నారు. మనం చేసిన ప్రతి పని ప్రజల మేలు కోసమేనన్నారు. ప్రతి పక్షాలు మనపై దుష్ప్రచారం చేసేందుకు సోషల్ మీడియాను వేదికగా ఎంచుకున్నాయని తెలిపారు. సోషల్ మీడియా వారియర్స్గా మీరు బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ప్రతిపక్షాలు దుష్ప్రచారాన్ని తక్షణం సోషల్ మీడియా ఇన్చార్జిలకు సంబంధిత న్యూస్ పంపిస్తే ఫ్యాక్ట్ చెక్ చేసి నిజాలు ప్రజలకు వివరిస్తారన్నారు.
దేశంలోనే తెలంగాణ అగ్రరాష్ట్రం అనే విషయం ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. సీఎం కేసీఆర్ దేశంలోనే అత్యంత జనాదరణ ఉన్న నేతనే విషయం సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలపాలని కోరారు. బీఆర్ఎస్ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో ప్రతిపక్షాలకు అందనంత ఎత్తున ఉందన్నారు. నెగెటీవ్ న్యూస్ ప్రజల్లోకి వస్తే తక్షణం అందరూ స్పందించి తిప్పికొట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ ఐదు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లపై చురుకుగా ఉండాలని సూచించారు. ఫేక్ న్యూస్ ఎలా ప్రభావం చూపింది ఆయన డిజిటల్ తెరపై ప్రదర్శనలో వివరించారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావుల సోషల్ మీడియా వీడియోలు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి.
సోషల్ మీడియా సేవలు పార్టీకి అవసరం
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోషల్ మీడియా విభాగం సేవలు
బీఆర్ఎస్ పార్టీకి అవసరం అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఫోన్ వినియోగం పెరగడంతో ప్రతిఒక్కరు ఏ సమాచారం కావాలన్నా సోషల్ మీడియాలో వెతుకుతున్నారని అన్నారు. పటాన్చెరు నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఎంతో అభివృద్ధి చేసుకున్నట్లు తెలిపారు. ఈమారు గతంలో కంటే అధిక మెజార్టీ కావాలంటే తప్పకుండా మన అభివృద్ధిని సోషల్ మీడియాలో ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ను కోరారు. ప్రతి కార్యక్రమం ప్రజల్లోకి వెళ్లేలా మీరు కృషిచేయాలన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రతి ముగ్గురిలో ఇద్దరు సోషల్ మీడియా వాడుతున్నందున మీరు యాక్టివ్గా ఉండాలన్నారు. పార్టీకి కోసం శ్రమించిన ప్రతి ఒక్కరినీ పార్టీ గుర్తిస్తుందని భరోసా ఇచ్చారు.
గూగుల్లో, ఇతర సాఫ్ట్వేర్ సంస్థల్లో పనిచేసే ఐటీ ఉద్యోగుల స్వచ్ఛందంగా నాకోసం పనిచేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. వారి అభిమానం కారణంగా మూడోమారు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియాను బలోపేతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, జడ్పీటీసీలు కుమార్గౌడ్, సుధాకర్రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడులు బీ పాండు, వెంకటేశంగౌడ్, మెరాజ్ఖాన్, శ్రీధర్చారి, మాజీ ఎంపీపీలు యాదగిరియాదవ్, శ్రీశైలంయాదవ్, వివిధ సోషల్ మీడియా విభాగం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.