మెదక్ మున్సిపాలిటీ/ హవేళీఘనపూర్/ పెద్దశంకరంపేట/ టేక్మాల్/ పాపన్నపేట, డిసెంబర్ 28 : తొలిమెట్టు కార్యక్రమం ద్వారా విద్యార్థులకు సులభతరంగా విద్యాబోధన చేసే విధంగా మేళా నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపా రు. హవేళీఘనపూర్ మండలకేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో మండల స్థాయి టీఎల్ఎం మేళా నిర్వహించారు, ఉపాధ్యాయు లు వివిధ రకాల బోధన పద్ధ్దతులను ప్రదర్శించగా, వాటిని ప్రతిమాసింగ్ అడిగి తెలుసుకున్నారు. మండల స్థాయిలో ప్రతిభకనబర్చిన ఉపాధ్యాయులను జిల్లా స్థాయికి ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. పిల్లలకు ఇంగ్లిష్, ఈవీఎస్, తెలుగు, గణితం పాఠాలను బోధనోపకరణాలను ఉపయోగించి, విద్యా బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో డీఈవో రమేశ్కుమార్, సర్పంచ్ సవిత ఉన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేయడంలో బోధన ఉపకరణాలు ఎంతో ఉపయోగపడుతాయని మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రం మెదక్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మండలస్థాయి తొలిమె ట్టు మేళాను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ విద్యార్థులను ఉన్నతస్థాయిలో తీర్చిదిద్దాలన్నారు. జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, డీఈవో రమేశ్కుమార్, ఎంపీపీ ప్రదర్శనలను తిలకించి, ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులు అందజేశారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధించాలని ఎంపీపీ శ్రీనివాస్ అన్నారు. పెద్దశంకరంపేటలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. కార్యక్రమంలో సర్పం చ్ సత్యనారాయణ, వైస్ ఎంపీపీ లక్ష్మీరమేశ్, ఎంపీటీసీ దత్తు, నోడల్ ఆఫీసర్ రాజేశ్వర్రావు, హెచ్ఎంలు రామచంద్రాచారి, సుజాత, విఠల్, విజయ్కుమార్, సంగమేశ్వర్ ఉన్నారు. ఉపాధ్యాయులు విద్యాబోధనలో కొత్త పద్ధతులు పాటిం చాలని టేక్మాల్ తహసీల్దార్ హర్దీప్సింగ్ సూచించారు. ప్రతి విభాగం నుంచి ఐదు పాఠశాలలను జిల్లా స్థాయికి పంపిస్తామన్నారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ శివకుమార్, ఎంపీటీసీ వాణీరమేశ్, నాయకులు నాయికోటి భాస్కర్, రవి ఉన్నారు. పాపన్నపేటలో 250 ఉపకరణాల నుంచి 20 నమూనాల ను ఎంపీపీ ప్రశాంత్రెడ్డి, ఎంఈవో నీలకంఠం జిల్లాస్థాయికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో రైతుబంధు మం డలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ గురుమూర్తిగౌడ్, ఎంపీటీసీ శ్రీనివాస్, సైన్స్ అధికారి రాజిరెడ్డి, నోడల్ అధికారి అంజాగౌడ్, హెచ్ ఎంలు హరిసింగ్, ప్రతాప్రెడ్డి, రాజయ్య పాల్గొన్నారు.
తర గతి గదిలో అభ్యాసన ఉపకరణాలు విద్యార్థులకు ఉపయోగపడుతాయని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్గౌడ్, ఏఎంసీ చైర్మన్ యాదగిరి అన్నారు. రామాయంపేటలో జరిగిన మేళాలో నోడల్ ఆఫీసర్లు శ్రీనివాస్, సుదర్శనమూర్తి, రవీందర్రావు, సవిత, నేతలు సత్యం, రవీందర్గౌడ్, ఇంద్రసేనాచారి, రాములు, సురేశ్కుమార్, శేఖర్, సంతోశ్, శంకర్, మల్లేశం, సురేందర్, మహేశ్, నర్సాగౌడ్, రమేశ్, నాగేశ్వర్రావు ఉన్నారు. నిజాంపేట పాఠశాలలో టీఎల్ఎం మేళా నిర్వ హించారు. మేళాలో ఎంపీపీ సిద్ధిరాములు, ఎస్సై శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ గంగాప్రసాద్, ఎంపీటీసీ బాల్రెడ్డి, నోడల్ అధికారి శ్రీనివాస్, హెచ్ఎం రవీందర్ ఉన్నారు.
చేగుంటలోని ఆదర్శ పాఠశాలలో మండలంలోని 28 పాఠశాలల నుంచి 400 ప్రదర్శనలు ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీటీసీ శ్రీనివాస్, సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, సొసైటి చైర్మన్ పరమేశ్, కాంప్లెక్స్ టీచర్లు మల్లారెడ్డి, అమర్శేఖర్రెడ్డి ఉన్నారు. నార్సింగిలో జరి గిన కార్యక్రమంలో ఎంపీపీ సబిత, జడ్పీటీసీ కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ సుజాత, ఎంపీటీసీ సత్యనారాయణ పాల్గొన్నారు.
బోధనపై టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ ఆసక్తిని పెంపొందిస్తాయని ఎంఈవో బుచ్చానాయక్ పేర్కొన్నారు. నర్సాపూర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో టీఎల్ఎం మేళా ప్రారంభిం చారు. మేళాకు ఎంపీపీ జ్యోతీసురేశ్, వైస్ఎంపీపీ వెంకటనర్సింగరావు, మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ హాజరయ్యారు.
శివ్వంపేట జడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన మేళాలో ఎంపీపీ హరికృష్ణ, ఎంఈవో బుచ్యానాయక్సర్పంచ్ శ్రీనివాస్గౌడ్, నోడల్ అధికారి సురేందర్, కాంప్లెక్స్ హెచ్ఎంలు సోమకృష్ణ, ఇందుమతి, కిశోర్, సురేశ్ ఉన్నారు. చిలిపిచెడ్ ప్రాథమిక పాఠశాలలో ప్రదర్శనలను నోడల్ అధికారి విఠల్, ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి, సర్పంచ్ లక్ష్మీదుర్గారెడ్డి పరిశీలించారు. అజ్జమర్రి, సోమక్కపేట, చిట్కుల్ పాఠశాలలను సైతం సందర్శించారు.