మెదక్ మున్సిపాలిటీ/ చిలిపిచెడ్/ నర్సాపూర్/ చేగుంట, మార్చి 31: ఈస్టర్ పండుగ పురస్కరించుకుని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ మహా దేవాలయంలో (చర్చి) ఆదివారం తెల్లవారు జామున నుంచి ఈస్టర్ వేడుకలు కనులపండువగా ప్రారంభమయ్యా యి. గుడ్ ఫ్రై డే రోజు శిలువపై అసువులు బాసిన యేసు ప్రభువు మూడో రోజు సమాధి నుంచి భక్తులకు దర్శనమిస్తాడు. కాళ్లు, చేతులకు కొట్టిన మేకుల గాయాలను చూసి గుర్తెరిగి యేసయ్య లేచి వచ్చాడని ఆనందోత్సాహాలతో భక్తులు ఉప్పొంగిపోతారు. దీన్ని క్రైస్తవు లు ఈస్టర్ (పునరుత్థాన పండుగ)గా జరుపుకొంటారు. ఈస్టర్ను పురస్కరించుకుని రాష్ట్ర నలుమూలల నుంచి, ఆంధ్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చారు. వేలాది మంది భక్తులతో మెదక్ మహా దేవాలయం కిటకిటలాడింది.
మెదక్ చర్చి ప్రెసిబేటరీ ఇన్చార్జి రెవరెండ్ శాంతయ్య ఆధ్వర్యంలో ఉదయం నాలుగున్న ర గంటలకు సిలువ ఉరేగింపుతో ఈస్టర్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈస్టర్ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సిలువకు మహిళ లు పెద్దఎత్తున కొవ్వొత్తులు వెలిగించి స్మరించుకున్నారు. ఆరాధన దైవం, ప్రత్యేక ప్రార్ధనల తో చర్చి ప్రాంగణం హోరెత్తింది. చర్చి గురువులు భక్తిసూక్తులు, భక్తి గీతాలు ఆలపించారు. కొందరు క్రైస్తవులు ఆప్తుల సమాధుల వద్ద కొవ్వొత్తులు వెలిగించి స్మరించుకున్నారు.
* ప్రెసిబేటరీ ఇన్చార్జి శాంతయ్య
మరణాన్ని జయించి సజీవుడైన దేవుడు. యుగయుగాలకు సజీవుడై ఉండే యేసయ్య అని మెదక్ చర్చి ప్రెసిబేటరీ ఇన్చార్జి రెవరెండ్ శాంతయ్య అన్నారు. ఈస్టర్ను పురస్కరించుకుని ఉదయం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని భక్తులకు దైవ సందేశం వినిపించారు. ఈ వేడుకల్లో చర్చి పాస్టర్లు, జైపాల్, శ్రీనివాస్, డేవిడ్, చర్చి కమిటీ సభ్యులు గంట సంపత్, జాన్సన్, గెలెన్, జాయ్ముర్రే, సువన్డగ్లస్, సంశాన్సందీప్, నోబుల్సన్ పాల్గొన్నారు.
చిలిపిచెడ్ మండలంలోని చిట్కుల్ గ్రామ చర్చిలో ఈస్టర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈస్టర్ను పురస్కరించుకుని సిలువకు మహిళలు పెద్దఎత్తున కొవ్వొత్తులు వెలిగించి స్మరించుకున్నారు. ఆరాధన దైవం ప్రత్యేక ప్రార్థనలతో చర్చి ప్రాంగణంలో గురువుల భక్తిసూక్తల మధ్య భక్తి గీతాలను ఆలపించారు. కార్యక్రమంలో చర్చి పాస్టర్లు సంఘం సభ్యులు,భక్తులు పాల్గొన్నారు.
నర్సాపూర్ మండలంలోని పెద్దచింతకుంట గ్రామంలో లోగోస్ గాస్పెల్ మినిస్ట్రీస్ చర్చిలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈస్టర్ వేడుకల అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో సభ్యురా లు లాజర్ దివ్య, నిర్వాహకులు హనోక్ కృష్ణ, హెబ్సిబా రేణుక తదితరులు పాల్గొన్నారు.
చేగుంట, నార్సింగి మండలంలోని పలు చర్చిల్లో ఈస్టర్ వేడుకలను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. పేద కుటుంబా లకు నూతన వస్ర్తాలు అందించి, ఈస్టర్ సందేశాన్ని అందించారు. ప్రార్థనల్లో పాస్టర్ ప్రభుదాస్, శాంసన్, అభిలాష్, సుధాకర్, సిద్ధిరాములుతోపాటు క్రైస్తవులు పాల్గొన్నారు.