జిన్నారం, నవంబర్ 24 :మండల కేంద్రం జిన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం జిల్లా టీబీ నియంత్రణ అధికారులు ఉచిత ఛాతి ఎక్స్రేలు నిర్వహించారు. జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ రాజేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉచిత చాతీ ఎక్స్రే కార్యక్రమానికి మండలంలోని వివిద గ్రామాలకు చెందిన ప్రజలు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. టీబీ లక్షణాలు గల 93 మందికి చాతి ఎక్స్రేలు నిర్వహించి అందులో 23 మందికి తెమడ పరీక్ష కోసం జిల్లా క్షయ వ్యాధి నివారణ కార్యాలయానికి శాంపిల్స్ పంపించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రాజేశ్వరి మాట్లాడుతూ క్షయ వ్యాదిని జిల్లాలో పూర్తిగా నిర్మూలించేందుకు పీహెచ్సీల్లో క్షయ వ్యాది నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. క్షయ వ్యాధి లక్షణాలు కనిపించిన వారు సంబంధిత వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు తగిన జాగ్రత్తలు వహిస్తూ మందులు వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్రేక్ ఇన్ ద బ్యారియర్స్ ప్రాజెక్ట్ ప్రోగ్రాం మేనేజర్ పురుషోత్తం, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భావన, సూపర్వైజర్ దేవేందర్రాజు, ల్యాబ్ సూపర్వైజర్ నర్సిరెడ్డి, పటాన్చెరు టీడీ కో ఆర్డినేటర్ కృష్ణ, సీహెచ్వో బాలరాజు, ఎంపీహెచ్ఈవో కృష్ణతేజ, టీడీ నోడల్ సూపర్వైజర్ శ్రీలక్ష్మీ, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
తొలిమెట్టు అమలు చేయాలి: ఎస్సీఆర్టీ
రేగోడ్,నవంబర్ 24: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న తొలిమెట్టు అమలును పరిశీలించెందుకు రాష్ట్ర సందర్శించిన ఎస్సిఆర్టి బృందం గురువారం మండలంలోని ప్రాథమిక పాఠశాలలైన మర్పల్లి,లింగంపల్లి,తాటిపల్లి, పాఠశాలను సందర్శించింది ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సిఆర్టి బృందం సభ్యులు వినయ్కుమార్ ,ఈశ్వర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కనీస విద్యఅయిన రాయడం చదవడం, గణిత చతుర్విద ప్రక్రియలపై పరిశీలన జరిపామన్నారు.అనంతరం ఎఫ్ ఎల్ ఎన్ అమలులో ఉపయోగించే రిజిష్టర్లను పరిశీలించారు. వీరి వెంట నోడల్ అధికారి లక్ష్మన్, సిఆర్పి సంతోష్ కుమార్,రవి ప్రధానోపాధ్యాయులు నర్సింహరెడ్డి ఉన్నారు.
శివనగర్ గ్రామ అవసరాల కోసం భూమి కేటాయింపు
జిన్నారం, నవంబర్ 24: శివనగర్లో సర్వేనంబర్ 114లో టీఎస్ఐఐసీకి కేటాయించిన భూమిలోంచి గ్రామ అవసరాలకు 10 ఎకరాలు కేటాయించాలని మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిని గ్రామస్తులు కోరారు. మంత్రి ఆదేశాలతో ఎమ్మెల్యే, జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహరెడ్డిని కలిసి సమస్యను వివరించి 10 ఎకరాలు కేటాయించాలని కోరారు. దీంతో గురువారం సర్వే చేసి ఏడున్నర ఎకరాల భూమిని టీఎస్ఐఐసీ జేడీఎం భవాని, జిన్నారం సర్వేయర్ రామభద్రు గ్రామస్తులకు అందజేశారు.