మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 3 : ప్రసార సాధనాలైన టీవీ, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ల నుంచి, కృతిమ వెలుతురు కోసం వాడే సీఎఫ్ఎల్, ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్ల నుంచి వెలువడే నీలిరంగు కాంతి కాలుష్యానికి దారి తీస్తున్నదని ప్రముఖ మెమోరి శిక్షకుడు, రాష్ట్ర అవార్డు గ్రహీత అందె జీవన్రావు అన్నారు. ‘నిద్రకు ముందు మొబైల్ వాడితే జ్ఞాపకశక్తి తగ్గుతుందా’ అనే అంశంపై శనివారం మెదక్ జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీలి రంగు కాంతి కాలుష్యంతో మెలటోనిన్ తగిన మోతాదులో విడుదల కాకపోవడంతో రాత్రి సమయంలో నాణ్యమైన నిద్రకు ఆటంకం కలుగుందన్నారు. నిద్ర పోయినప్పుడు మెదడు మెళకువగా ఉండి పరిశుభ్రత పనులను నెరవేరుస్తుందని, ఈ పనుల్లో స్మృతి ఏకీతరణ ముఖ్యమైనదని, గాడ నిద్రలో మెరుగైన స్మృతి ఏకీకరణ జరిగి జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందన్నారు. ఎలక్ట్రానిక్ తెరల నుంచి వెలువడే నీలిరంగు కాంతి 80శాతం మెలటోనిన్ ఉత్పత్తని నిరోధిస్తుందన్నారు. మనం నిద్రించే సమయంలో రెండు గంటల ముందే ఎలక్ట్రానిక్ కర్యూ విధించుకోవాలని సూచించారు. రాత్రి సమయంలో వెలుతురు కోసం నీలిరంగు కాంతి అధికంగా వెదజల్లే సీఎఫ్ఎల్, ఎల్ఈడీ బల్బులు, ట్యూబులను వాడొద్దన్నారు. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా కాడేగావ్లోని వడ్గావ్ గ్రామంలో రాత్రి వేళలో వాడే డిజిటల్ డీటాక్సిఫికేషన్ కార్యక్రమాన్ని దేశమంతా విస్తరించాలన్నారు. తద్వారా మానవ లోకం సమగ్రాభివృద్ధికి దోహదపడాలన్నారు. ఈ సందర్బంగా జీవన్రావును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్గౌడ్, అధ్యాపకులు, విద్యార్థులు పాలొన్నారు.