రామాయంపేట, డిసెంబర్ 29 : పట్టణంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం తెల్లవారుజామున పద్మావతి, వేంకటేశ్వరస్వామివారికి భక్తులు పల్లకీసేవ చేశారు. భక్తులు పద్మావతి అమ్మవారు, వేంకటేశ్వరస్వామిని పూలతో అలంకరించారు. నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలోని తిరుమలనాథ స్వామిని భక్తులు దర్శించుకుని ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని పూలతో అలంకరించారు.
భక్తిశ్రద్ధలతో అయ్యప్ప పడిపూజ
వెల్దుర్తి, డిసెంబర్ 29 : పట్టణానికి చెందిన అంగడిపేట సాయితేజ నివాసంలో అయ్యప్ప పడిపూజను భక్తిశ్రద్ధ్దలతో నిర్వహించారు. గురుస్వాములు వెంకట్గౌడ్, రవీందర్గౌడ్, రాజయ్య, రాజేశంతోపాటు పూజారి వంశీశర్మ ఆధ్వర్యంలో గణపతిపూజ, పంచామృతాభిషేకాలు, అర్చనలు చేశారు.
బ్రాహ్మణపల్లిలో కొనసాగుతున్న చిత్తారమ్మ జాతర
నర్సాపూర్, డిసెంబర్ 29 : మండలంలోని బ్రాహ్మణపల్లి లో చిత్తారమ్మ జాతర వైభవంగా జరుగుతున్నది. రెండో రోజు మహిళలు భారీగా తరలివచ్చి అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించారు. దీంతో అగ్నిగుండాలు, బండ్లు తిరుగుట, బో నాల కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో పూజారి గొల్ల మల్లేశం, గ్రామస్తులు వంజరి శ్రీనివాస్, గంట కృష్ణ, ఆనంద్, నర్సింహులు, జైరాం తదితరులు పాల్గొన్నారు.
అన్నదానానికి ముస్లిం భక్తుడు విరాళం
చేగుంట, డిసెంబర్ 29 : మండలంలోని కర్నాల్పల్లి గ్రామంలో షిర్డ్డీసాయిబాబా ఆలయంలో ప్రతి గురువారం అన్నదానం నిర్వహిస్తారు. వచ్చే మాఘ పౌర్ణమికి 12వ వార్షికోత్సవాన్ని నిర్వహించనున్నారు. వర్గల్ మండలానికి చెందిన మహ్మద్ మహబూబ్ జిన్నారం మండల కేంద్రం లో స్థిరపడగా, వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి రూ.10వేల విరాళం అందజేశా డు. ఈ మేరకు మహ్మద్ మహబూబ్ను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో చైర్మన్ రమేశ్గుప్త్తా, సభ్యులు బాల్రెడ్డి, యాదిరెడ్డి, యాదగిరి, మధుసూదన్రెడ్డి, ప్రకాశ్, ప్రభాకర్రెడ్డి, గోపాల్రెడ్డి ఉన్నారు.