శివ్వంపేట, మార్చి 22 : శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల పరిధిలోని చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి దేవాలయంలో సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఉదయం గణపతిపూజ, పుణ్యాహవచనం, మహాసంకల్పం, ఆచార్య, రుత్విక్వరణం, గోపూజ, హోమం తదితర కార్యక్రమాలను చాకరిమెట్ల ఆలయ చైర్మన్ ఆంజనేయశర్మ ఆధ్వర్యంలో నిర్వహించా రు. ఉత్సవాలకు సీఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శి సింగాయపల్లి నర్సింగరావు దంపతులు, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, పటాన్చెరు నియోజకవర్గం సీనియర్ నాయకుడు నీలంమధు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈవో సార శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిష్ఠాపనోత్సవాల్లో పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, రాష్ట్ర నాయకుడు పైడి శ్రీధర్గుప్తా, సర్పంచ్ బాలమణీనరేందర్, ఎంపీటీసీ నువ్వుల దశరథ, పీఏసీఎస్ డైరెక్టర్ వీరస్వామి, ఆలయ నిర్మాణ దాత దశరథరెడ్డి, వేద పండితులు వామనశర్మ, దేవదత్తుశర్మ, ప్రభురాజశర్మతోపాటు భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
పెద్దశంకరంపేట, మార్చి 22 : ఉగాది పురస్కరించుకుని పెద్దశంకరంపేటలో దుర్గాభవానీ జాతర నిర్వహించారు. దుర్గమ్మ ఆలయం వద్ద ఉత్సవాల్లో భాగంగా ఎడ్లబండ్ల ఊరేగింపు నిర్వహించారు. దుర్గమ్మ ఆలయంతో పాటు కేశమ్మ, గంగమ్మ ఆలయాల చుట్టూ మూడు ప్రదక్షిణలు, అనంతరం పోచమ్మగుడి, కొండల రాయుడి గుడి వద్ద రెండు ప్రదక్షిణల బండ్ల ఊరేగింపు నిర్వహించారు. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగ ణం కిటకిటలాడింది. పెద్దశంకరంపేట మండలంలోని బద్దారం, మల్కాపురం, చీలపల్లి, ఉత్తూలూరు, శివాయపల్లి, మాడ్చెట్పల్లి, జూకల్ గ్రామాల్లో దేవాలయాల్లో సైతం ఎడ్లబండ్ల ఊరేగింపు నిర్వహించారు. ఆలయాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
హవేళీఘనపూర్, మార్చి 22 : మండలంలోని కూచన్పల్లిలో ఉన్న కూచాద్రి వేంకటేశ్వరస్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి కుటుంబీకులతో కలిసి స్వామివారికి పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి నవీన్పంతులు ఎమ్మెల్సీకి స్వాగతం పలికారు. ప్రతి ఉగాది పండుగ రోజు వేంకటే శ్వరస్వామిని దర్శించుకుంటానని ఎమ్మెల్సీ తెలిపారు. దేవాలయ అభివృద్ధ్దికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ దేవాగౌడ్, ఉప సర్పంచ్ బయ్య న్న, ఆలయ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు ఉన్నారు.
– సీనియర్ నాయకుడు నీలం మధు
శివ్వంపేట, మార్చి 22 : మండలకేంద్రం శివ్వంపేట లోని బగలాముఖి శక్తిపీఠం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గ సీనియర్ నాయకుడు నీలం మధు అన్నారు. ఉగాది సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఉపాసకులు శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ తీర్థప్రసాదాలు అందజేశారు. బగలాముఖి అమ్మవారి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలందరు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పత్రాల శ్రీనివాస్గౌడ్, ఉపసర్పంచ్ పద్మవెంకటేశ్, నాయకులు పోచాగౌడ్, లక్ష్మీనర్స య్య, కొండల్, ముద్దగల్ల రాజు, నీలం మధు అభిమానులు శ్రీకాంత్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.