కొమురవెల్లి ఆలయానికి పోటెత్తిన జనం
అభిషేకాలు, పట్నాలు, అర్చనలు, పూజలు
మొక్కులు చెల్లించుకున్న 15వేల మంది
రద్దీగా ఆలయ పరిసర ప్రాంతాలు
భక్తిశ్రద్ధలతో బోనాల సమర్పణ
చేర్యాల, జూన్ 5 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. సుమా రు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. భక్తులు స్వామివారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
మరికొందరు భక్తులు స్వామివారి నిత్య కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలతో బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు రాతిగీరలు వద్ద ప్రదక్షిణలు, కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టి పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఈవో బాలాజీ, ఏఈవో వైరాగ్యం అంజయ్య, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, సూపరింటెండెంట్ నీల శేఖర్, సిబ్బంది, అర్చకులు భక్తులకు సేవలందించారు.