పెద్దశంకరంపేట/ మెదక్ మున్సిపాలిటీ/ మెదక్ రూరల్/ చిన్నశంకరంపేట/ నర్సాపూర్/ వెల్దుర్తి/ శివ్వంపేట/ చేగుంట/ రామయంపేట/ నిజాంపేట, జూన్29ః జిల్లాలో తొలి ఏకాదశి వేడుకలను భక్తులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పెద్దశంకరంపేట మండలంలోని విఠలేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి దంపతులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయానికి నూతనంగా నిర్మిస్తున్న ద్వారానికి సంబంధించిన పనులను ఎమ్మెల్సీ ప్రారంభించారు. మాచవరం రామాలయం, మల్లికార్జున ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. చిన్నశంకరంపేట, నర్సాపూర్ మండలాల్లోని అన్ని గ్రామాల్లో, వెల్దుర్తిలోని విఠలేశ్వర దేవాలయం, శివ్వంపేట మండల కేంద్రంతో పాటు సికింద్లాపూర్లోని లక్ష్మీనృసింహస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
చేగుంట, నార్సింగి మండలాల్లోని పలు గ్రామాల్లో తొలి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామాయంపేట పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో మున్సిపల్ చైర్మన్ దంపతులు పల్లె జితేందర్గౌడ్-సౌమ్య, భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మహంకాళి ఆలయంలో మున్సిపల్, ఆలయ, పీఏసీఎస్ చైర్మన్లు జితేందర్గౌడ్, పాండురంగాచారి, సరాఫ్ఆదగిరి,బాదె చంద్రం, కౌన్సిలర్లు దేమె యాదగిరి, గజవాడ నాగరాజు, చిలుక గంగాధర్లు పూజలు చేశారు. నందగామ గ్రామంలో మహంకాళి, పట్టణంలోని ఏడీదుల రేణుకా ఎల్లమ్మ, మార్కండేయ ఆలయంలో భక్తులు పూజలు నిర్వహించారు. నిజాంపేటలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి.