పెద్దశంకరంపేట,ఆగస్టు05 : మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ రాజ్ పెండింగ్ పనులతో పాటు మండలంలో చేపట్టబోయె అభివృద్ధి పనులపై సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ రాజ్ అధికారులతో సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని, నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జెడ్పీటీసీ భూత్కూరి విజయరామరాజు, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మురళీ పంతులు, పీఆర్ ఎస్ఈ జోగారెడ్డి, డీఈ శ్రీనివాస్, ఏఈ భానుప్రకాశ్, ఎంపీడీవో రియాజొద్దిన్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, తదితరులున్నారు.