కొండపాక, జనవరి 29: గులాబీ అధినేత కేసీఆర్తోనే గ్రామాల అభివృద్ధి జరిగిందని సిద్దిపేట జడ్పీ చైర్మన్ వేలేటి రోజాశర్మ, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్రెడ్డి అన్నారు. సర్పంచ్ల పదవీకాలం ముగియనున్న సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో ఎంపీపీ ర్యాగళ్ల సుగుణ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల సర్పంచ్లకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధి గ్రామాల్లో చిరస్థాయిలో నిలిచిపోతుందన్నారు. కేసీఆర్, హరీశ్రావు కృషితో గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునే అవకాశం దక్కడం అదృష్టమన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీరవీందర్, సర్పంచ్ల ఫోరం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఆరెపల్లి మహదేవ్గౌడ్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు చింతల సాయిబాబాగౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వాసరి లింగారావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నూనె కుమార్యాదవ్, తహసీల్దార్ శ్రీనివాస్యాదవ్, ఎంపీడీవో రాంరెడ్డి, సర్పంచ్లు చిట్టి మాధురి, పోల్కంపల్లి జయంతీనరేందర్, పిడిశెట్టి శ్రీనివాస్, అమ్ముల రమేశ్, మహిపాల్ పాల్గొన్నారు.