నాగల్గిద్ద, జనవరి 30 : ప్రజలకు జవాబుదారీగా పారదర్శకమైన పాలన అందించడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం నాగల్గిద్ద ఉపసర్పంచ్ కోటాలె అనిల్ బీజేపీకి రాజీనామా చేసి తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు మేత్రి పండరి, నాయకులు నాగ్శెట్టి, వైస్ ఎంపీపీ పండరి యాదవ్, రమేశ్ చౌహ్హన్ తదితరులు ఉన్నారు.