రాయపోల్ : సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలం అనాజీపూర్ గ్రామానికి చెందిన సౌందర్య అనే గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్ ( Ambulance ) లోనే ప్రసవించింది. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కి సమాచారం ఇచ్చారు.
దౌల్తాబాద్ నుంచి వచ్చిన 108 అంబులెన్స్ సిబ్బంది ఆమెను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో పురిటి నొప్పులు అధికమయ్యాయి. దీంతో అంబులెన్స్ సిబ్బంది ఆమెకు ప్రసవం ( Delivery ) చేశారు. ఆమె ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. తల్లి,బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండడంతో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా గర్భిణికి సహాయమందిచిన 108 సిబ్బంది దేవేందర్, నర్సింలుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.