నర్సాపూర్/ కొల్చారం/ కౌడిపల్లి/ శివ్వంపేట/ వెల్దుర్తి, మార్చి 24 : సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన పల్లెప్రగతితోనే గ్రామాలు అన్ని విధాలా అభివృద్ధ్ది చెందాయని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సాపూర్ ఎంపీడీవో సమావేశ మందిరంలో ఎంపీపీ వెంకటనర్సింగరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలను గ్రామపంచాయతీలకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో పరిశుభ్రత, మొక్క లు నాటుట కార్యక్రమాలను అమలు చేయడంతోనే పురస్కారాలు దక్కాయన్నారు. పల్లెప్రగతిలో గ్రామాలు పోటీ పడి అభివృద్ధ్ది పథంలో దూసుకెళ్తున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్లులను నెలాఖరు వరకు చెల్లించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నర్సాపూర్లో కార్యక్రమంలో ఎంపీటీసీ వెంకటనర్సింగరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కోఆప్షన్ మెంబర్, జడ్పీటీసీ, డీఆర్డీవో శ్రీనివాస్, ఎంపీడీవో లూథర్, బీఆర్ఎస్ నేత భిక్షపతి ఉన్నారు.
కొల్చారం మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ పంచాయతీ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. కార్యక్రమంలో ఎంపీడీవో గణేశ్రెడ్డి, ఎంపీపీ మంజుల, జడ్పీటీసీ మేఘమాల, సర్పంచ్ విష్ణువర్ధన్రెడ్డి, వైస్ ఎంపీపీ మల్లారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గౌరీశంకర్గుప్త్తా ఉన్నారు. కౌడిపల్లి మండలంలో 29 గ్రామాలకు 19 పంచాయతీలు పురస్కారాలకు ఎంపికయ్యాయి. కార్యక్రమంలో ఎంపీపీ రాజు, జడ్పీటీసీ కవిత, ఎంపీడీవో శ్రీనివాస్ ఉన్నారు.
శివ్వంపేటలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. మండలంలోని 16 గ్రామపంచాయతీలకు అవార్డులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రమాకాంత్రెడ్డి, ఇన్చార్జ్జి ఎంపీడీవో తిరుపతిరెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
వెల్దుర్తిలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యదర్శులకు అవా ర్డులను ఎమ్మెల్యే మదన్రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ రమేశ్గౌడ్, రైతుబంధు మండ లాధ్యక్షుడు వేణుగోపాల్రెడ్డి, బీఆర్ఎస్ మండలాల అధ్యక్షు లు భూపాల్రెడ్డి, మధుసూదన్రెడ్డి, ఎంపీడీవో వెంకటలక్ష్మ మ్మ, తహసీల్దార్ నాగవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్ రూరల్/ హవేళీఘనపూర్/ రేగోడ్/ టేక్మాల్/ అల్లాదుర్గం/ పాపన్నపేట, మార్చి 24 : మెదక్ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాప్రతినిధులకు ఎంపీపీ యమున, ఎంపీడీవో శ్రీరాములు అవార్డులు అందజేశారు. గ్రామాలన్నీ అభివృద్ధి లో ఆదర్శంగా మారాలని ఎంపీపీ సూచించారు. కార్యక్ర మంలో వైస్ఎంపీపీ ఆంజనేయులు, ఎంపీవో ప్రశాంత్, ఎంపీటీసీలు ప్రభకర్, శ్రీహరి, కార్యదర్శులు పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధులు బాధ్యతతో పని చేయాలని హవేళీఘనపూర్ మండల ప్రత్యేకాధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ విజయలక్ష్మి అన్నారు. హవేళీఘనపూర్లో ఎంపీపీ శేరి నారాయణరెడ్డి బూర్గుపల్లి, సర్దన, శమ్నాపూర్, తొగిట, రాజ్పేట, సుల్తాన్పూర్ సర్పంచ్లు, సెక్రటరీలకు అవార్డులు అందజేశారు. రేగోడ్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్పంచ్లు దిన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాలను ఎంపీపీ సరోజన, వైస్ ఎంపీపీ వినీల అందజేశారు.టేక్మాల్లో ప్రజాప్రతినిధులకు ఎంపీడీవో లక్ష్మి, ఎంపీపీ స్వప్న, వైస్ఎంపీపీ మంజుల అవార్డులు అందజేశారు.అల్లాదుర్గం మండలంలోని గ్రామాలకు 24 అవార్డులు వచ్చినట్లు జడ్పీటీసీ సౌందర్య తెలిపారు. అవార్డుల పంపిణీ లో మాజీ ఎంపీపీ కాశీనాథ్, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, ఎంపీటీసీ దశరథ్,ఇన్చార్జి ఎంపీడీవో శంకర్ పాల్గొన్నారు.పాపన్నపేటలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ చందనారెడ్డి, ఎంపీడీవో జగదీశ్వర్చారి, వైస్ ఎంపీపీ విష్ణువర్ధన్రెడ్డి, సర్పంచ్ జగన్, కోఆప్షన్ సభ్యుడు గౌస్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, ఎంపీడీవో లక్ష్మీకాంతరెడ్డి పాల్గొన్నారు.
చిన్నశంకరంపేటలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ భాగ్యలక్ష్మీరెడ్డి, జడ్పీటీసీ మాధవి, ప్రత్యేకాధికారి విజయా శేఖర్రెడ్డి, ఎంపీడీవో ప్రవీణ్, ఎంపీవో గిరిధర్రెడ్డి, సూపరింటెండెంట్ అశోక్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
నిజాంపేట, మార్చి 24 : గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి వేగంగా జరుగుతున్నదని ఎంపీపీ సిద్ధిరాములు అన్నారు. మండలంలోని 14 పంచాయతీలు ఉండగా 12 గ్రామాలకు అవార్డులు వచ్చాయన్నారు. సర్పంచ్లు, కా ర్యదర్శులకు అవార్డు, ప్రశంసా పత్రాలు అందజేశారు.