అల్లాదుర్గం, అక్టోబర్29 : అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని కాయిదంపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్ఐ మోహన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కాయిదంపల్లి గ్రామానికి చెందిన గడ్డం మల్లయ్య(49) బతుకుదెరువు కోసం హైదరబాద్లో కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.
మల్లయ్యకు బయట వ్యక్తుల వద్ద అప్పులు చేయడంతో అప్పులు ఎలా తీర్చాలో అని మనస్తాపం చెందేవాడు. ఈ నెల 28 తన ఇంటికి వెళ్తున్నా అని తన భార్యతో వచ్చాడు. గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గ్రామస్థులు మృతుడి భార్యకు సమాచారం అందజేశారు.