వెల్దుర్తి: దళితుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన దళితబంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. మాలమహానాడు మాసాయిపేట మండల కమిటీని సోమవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రవికుమార్, సత్యనారాయణ, జిల్లా ఇన్చార్జి శ్రీరాములుతో కలిసి ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా మాసాయిపేటకు చెందిన గుర్రం అశోక్, కార్యదర్శిగా నర్సింలు, ఉపాధ్యక్షుడిగా బాలనర్సింలు, కోశాధికారిగా శ్రీకాంత్ లను గ్రామ కమిటీ సభ్యుల సమక్షంలో ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ మాట్లాడుతూ దళితబంధు పథకం దళితుల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందన్నారు. దళితులలో ఉన్న 59 ఉపకులాలకు ఈ పథకాన్ని వర్తింప చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో మాసాయిపేట మండల పరిధిలోని ఆయా గ్రామల మాల నాయకులు పాల్గొన్నారు.