సిద్దిపేట, జనవరి 29: రెండో విడత మంజూరైన దళితబంధు నిధులను ప్రభుత్వం విడుదల చేయాలని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని 23 గ్రామాలకు చెందిన 150 మంది లబ్ధిదారులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం అడిషనల్ కలెక్టర్ గరిమాఅగర్వాల్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంబేదర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, మండల అధ్యక్షుడు బాలనర్సు, తెలంగాణ అంబేదర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు పరశురాములు మాట్లాడుతూ రెండో విడతలో దళితబంధు పథకం కింద మంజూరైన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమా ండ్ చేశారు. ఎన్నికల కోడ్కు ముందు రూ.3 లక్షలు కలెక్టర్ అకౌంట్లోకి వచ్చాయని, మిగతా ఏడు లక్షలు కలిపి మొత్తం రూ.10 లక్షలను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలన్నారు.