చిన్నశంకరంపేట, అక్టోబర్25 : కుక్కల దాడి 13 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన నార్సింగి మండలం సంకాపూర్లో సోమవారం చోటు చేసుకుంది. సంకాపూర్ గ్రామానికి చెందిన బైకరి భిక్షపతి తన గోర్రెలను రోజు వారి మాదిరిగా పాకలోకి తోలి నిద్రకు ఉపక్రమించాడు.
సోమవారం తెల్లవారుజామున గెర్రెల కొట్టంపై కుక్కలు దాడి చేయగా 13 గొర్రెలు మృతి చెందాయి. మరి కొన్ని గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ సంఘటనలో లక్షా20వేల రూపాయల ఆస్తినష్టం జరిగిందని బాధితుడు భిక్షపతి బోరున విలపించాడు.