చిలిపిచెడ్, జనవరి 29 : క్రీడాకారులకు గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో పోటీ పడాలని నర్సాపూర్ ఎమ్మె ల్యే మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని బండపోతుగల్ గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన బీపీఎల్ టీ-10 ప్రీమియర్ లీగ్-1 క్రికెట్ టోర్నమెంట్ ముగ్గింపు కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. క్రీడాకారులకు క్రికెట్ కిట్ అందజేసి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసంతోపాటు స్నేహసంబంధాలు పెంపొందుతాయన్నారు.
బండపోతుగల్ గ్రామంలో అభివృద్ధి పనుల్లో భాగంగా మంచినీటి ట్యాంక్, ఎస్సీ కమ్యూనిటీ హాల్, ఈద్గా పనులను ప్రారంభించారు. అనంతరం సీనియర్ నేత కిష్టారెడ్డిని పరామర్శించారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, సర్పంచ్ ఇస్తారి, ఎంపీటీసీలు మల్లమ్మసంగాగౌడ్, మల్లయ్య, మండల కో ఆప్షన్ సభ్యుడు షఫీ, అజ్జమర్రి సర్పంచ్ పరశురాంరెడ్డి, ఉప సర్పంచ్ మాణిక్యం, సొసైటీ చైర్మన్ ధర్మారెడ్డి, వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు సయ్యద్ హుస్సేన్, ఆత్మ కమిటీ డైర్టెకర్ వీరాస్వామి, బీఆర్ఎస్ మం డల ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ మండలాధ్యక్షుడు నరేందర్రెడ్డి, మహిళా మండలాధ్యక్షురాలు మీనాప్రసున్న, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు సుధీర్రెడ్డి, నాయకులు మాణిక్యరెడ్డి, ఎంసీ విఠల్, ముకుందరెడ్డి, పోచయ్య పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్తో పేదలకు భరోసా : సునీతాలక్ష్మారెడ్డి
సీఎంఆర్ఎఫ్ పేదలకు భరోసాగా నిలుస్తున్నదని మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. హత్నూరా మండలం వడ్డేపల్లికి చెందిన కంచిగారి శంకర్ అనారోగ్యంతో కొద్ది రోజులుగా హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. చికిత్సకు సీఎం సహాయ నిధి నుంచి రూ.1 లక్ష ఎల్వోసీ చెక్కు మంజూరైనంది. నర్సాపూర్ క్యాంప్ కార్యాలయంలో బాధితుడికి చెక్కును మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ.. ఎంతో మందికి సీఎంఆర్ఎఫ్ అండగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సత్యంగౌడ్, ఖాజీపేట్ సుధాకర్రెడ్డి, తొంట వెంకటేశ్, షేక్ హుస్సేన్, చింత స్వామి, నగేశ్, సలీం ఆలీ పాల్గొన్నారు.
మహిళా కమిషన్ క్యాలెండర్ ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ 2023 క్యాలెండర్ను వైద్యారోగ్య, ఆర్థికశాఖల మంత్రి హరీశ్రావుతో కలిసి మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి హైదరాబాద్లోని నానక్రామ్గూడలో మంత్రి నివాసంలో ఆవిష్కరించారు. మహిళల అభ్యున్నతి, రక్షణకు మహిళా కమిషన్ ఎంతగానో కృషి చేస్తుందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు కుమ్రా ఈశ్వరీబాయి, సుద్దం లక్ష్మి, కటారి రేవతి, కమిషన్ సెక్రటరీ కృష్ణకుమారి పాల్గొన్నారు.
శివ్వంపేటలో ఫంక్షన్హాల్ ప్రారంభోత్సవం…
శివ్వంపేట, జనవరి 29 : మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన జేకే ఫంక్షన్హాల్ను ఎమ్మెల్యే మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి ప్రారంభించారు. శివ్వంపేటలో మొట్టమొదటగా ఫంక్షన్హాల్ను నిర్మించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, ఎంపీపీ హరికృష్ణ, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మ న్సూర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, కోఆప్షన్ లాయక్, గూడూరు సర్పంచ్ స్వరాజ్యలక్ష్మీశ్రీనివాస్గౌడ్, నాయకులు కొడకంచి శ్రీనివాస్గౌడ్, రవిగౌడ్, ఫంక్షన్హాల్ నిర్వాహకులు సయ్యద్ జావీద్, సయ్యద్ ముస్తాఫా ఉన్నారు.