నర్సాపూర్, జనవరి 28 : యువత క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం నర్సాపూర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గ్రీన్స్టార్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, ఆత్మకమిటీ చైర్మన్ గొర్రె వెంకట్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, ఏఎంసీ వైస్ చైర్మన్ హబీబ్ఖాన్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, పట్ట ణాధ్యక్షుడు భిక్షపతి, రాష్ట్ర నాయకుడు అశోక్గౌడ్, నాయకులు దావూద్, నగేశ్తోపాటు క్రీడాకారులు పాల్గొన్నారు.
క్రీడాపోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చాలి
సాఫ్ట్బాల్ క్రీడాపోటీల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చాలని సాఫ్ట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శోభన్బాబు సూచించారు. ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు ఒడి స్సా రాష్ట్రం పూరిలో జరుగనున్న 44వ జాతీయస్థాయి సీనియర్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే తెలంగాణ పురుషుల జట్టు శిక్షణ శిబిరం నర్సాపూర్లోని గిరిజన గురుకుల పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్నారు. శిక్షణ శిబిరాన్ని శోభన్బాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు శిక్షణ శిబిరాన్ని సద్వినియోగపర్చుకుని ఉత్తమ ప్రతిభ చాటాలని సూచించారు. ఈ నెల 21 నుంచి 23 వరకు భూపాలపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న జట్ల నుంచి 23 మంది క్రీడాకారులను ఎంపిక చేసి, జాతీయపోటీలకు పంపిస్తున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో సాఫ్ట్బాల్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు అజయ్కుమార్గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్శర్మ, కోశాధికారి గోవర్ధన్, అకాడమీ కోచ్ షానవాజ్, వ్యాయామ ఉపాధ్యాయుడు రాజు పాల్గొన్నారు.
-సాఫ్ట్ట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శోభన్బాబు
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య : ఎమ్మెల్యే
కొల్చారం, జనవరి 28 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. కిష్టాపూర్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో సరస్వతీమాత విగ్రహాన్ని జడ్పీటీసీ మేఘమాల, ఎంపీపీ మంజులతో కలిసి ఆవిష్కరించారు. ముందుగా కోదండరామాలయం నుంచి సరస్వతీమాత విగ్రహాన్ని ఊరేగింపుగా పాఠశాలకు తీసుకువచ్చి, ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి ‘మన ఊరు-మనబడి’ అమలు చేస్తున్నదన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని సూచిం చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గౌరీశంకర్, మెదక్ ఏఎంసీ వైస్చైర్మన్ సావిత్రిరెడ్డి, జిల్లా గ్రంథాల య చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్ అహ్మద్, సర్పంచ్ గోదావరి, ఉపసర్పంచ్ కిష్టయ్య, ఎంపీ డీవో గణేశ్రెడ్డి, ఆర్ఐ శ్రీహరి, అధికారులు ప్రవీణ్, వెంకట్రాములు, సంతోశ్కుమార్, కాశీనాథ్, ఉపాధ్యాయులు సురేందర్గౌడ్, బీమ్లానాయక్ తదితరులు పాల్గొన్నారు.