రామాయంపేట, అక్టోబర్ 18 : ప్రజల భద్రత కోసం ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని ఆదేశాలతో తనిఖీలు చేపట్టామని రామాయంపేట సీఐ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. తనిఖీల్లో సరియైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసు కున్నట్లు పేర్కొన్నారు. ఎస్పీ ఆదేశాలతో కమ్యూనిటీ కనెక్ట్ పేరిట కార్డన్ సెర్చ్ మున్సిపాలిటీ నిర్వహించారు. కార్డన్ సెర్చ్ లో సర్కిల్ పరిధిలోని ఐదు పోలీస్స్టేషన్ల ఎస్సైలు, 39 మంది సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని ఎస్సీ కాలనీ, పిట్టల బస్తీ, కాటికవాళ్ల గల్లీలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. మూడు కాలనీల్లో పత్రాలు లేని 50 బైక్లను స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్కు తరలించామన్నారు.
తగిన పత్రాలు ఉంటే వాహనాలను వాహనదా రులు తీసుకోవచ్చన్నారు. ప్రజలకు భద్రత కల్పించడానికే కార్డన్ సెర్చ్ నిర్వహించామని, ప్రజల కోసమే పోలీసులు ఉన్న ట్లు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే సమాచా రం పోలీసులకు ఇవ్వాలని కోరారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్ పోలీసులు ఉన్నారని, ఏ ఇబ్బందులు ఉన్నా పోలీసుల సాయం పొందవచ్చన్నారు. తనిఖీల్లో రామాయంపేట, చేగుం ట, నిజాంపేట, నార్సింగి, చిన్నశంకరంపేట రాజేశ్, ఎస్సైలు ప్రకాశ్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, రాజేశ్, సుభాష్గౌడ్ ఉన్నారు.